పాకిస్తాన్ కు భారత్, అమెరికా ఘాటు హెచ్చరిక, టిల్లర్సన్ తో మోడీ, సుష్మా భేటీ
ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై పోరాటంలో భారత్, అమెరికా దృఢచిత్తాన్ని పునరుద్ఘాటించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే సహించబోమంటూ ఇరు దేశాలు పాకిస్తాన్కు ఘాటైన హెచ్చరికలు చేశాయి.పాకిస
ఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై పోరాటంలో భారత్, అమెరికా దృఢచిత్తాన్ని పునరుద్ఘాటించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే సహించబోమంటూ ఇరు దేశాలు పాకిస్తాన్కు ఘాటైన హెచ్చరికలు చేశాయి.
పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి సూచించాయి. మరోవైపు, భారత్-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, అఫ్గానిస్తాన్లో శాంతిస్థాపన వంటి అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని కూడా భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి.

పాకిస్తాన్ చర్యలను సహించబోం...
భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ బుధవారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో భేటీ అయ్యారు. ఉగ్రవాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా, హెచ్-1బీ వీసాలు, దక్షిణాసియాపై ట్రంప్ నూతన విధానం సహా పలు అంశాలపై వారు చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త విలేకర్ల సమావేశంలో పాల్గొన్న టిల్లర్సన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు సురక్షిత ఆవాసాలు కల్పించడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు బలం పుంజుకుంటే పాక్ స్థిరత్వానికే ముప్పు ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు సంపూర్ణ మద్దతు పలికారు.

అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో...
అభివృద్ధి పనుల ద్వారా అఫ్గాన్ పునర్నిర్మాణంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందంటూ కొనియాడారు. బలమైన శక్తిగా భారత్ అవతరించడంలో తాము మద్దతుగా నిలుస్తామని టిల్లర్సన్ పేర్కొన్నారు. ఎఫ్-16, ఎఫ్-18 యుద్ధ విమానాలతోపాటు సైన్యం ఆధునికీకరణకు అవసరమైన అత్యుత్తమ సాంకేతికతలన్నింటినీ భారత్కు అందజేస్తామని తెలిపారు.

మార్పులు తీసుకువచ్చేముందు..
పాకిస్తాన్ తారతమ్యాల్లేకుండా అన్ని ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటేనే.. దక్షిణాసియాపై ట్రంప్ నూతన విధానం విజయవంతమవుతుందని సుష్మాస్వరాజ్ సూచించారు. ఈ సందర్భంగా హెచ్-1బీ వీసా అంశంపై కూడా టిల్లర్సన్తో మాట్లాడానని ఆమె తెలిపారు. వీసా నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చేముందు.. అమెరికా ఆర్థికరంగం ఎదుగుదలలో భారత ఐటీ నిపుణుల భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరానన్నారు.

ఆ దేశంతో అల్పస్థాయి సంబంధాలే...
టిల్లర్సన్-స్వరాజ్ చర్చల్లో ఉత్తర కొరియా అంశం కూడా చర్చకు వచ్చింది. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు తగ్గించుకోవడం, దౌత్య కార్యాలయాన్ని మూసివేయడం వంటి అంశాలపై తాము చర్చలు జరిపామని సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఉత్తర కొరియాతో భారత్ అల్పస్థాయి వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నట్లు టిల్లర్సన్కు తెలియజేశానన్నారు.

భారత్-అమెరికా సంబంధాల బలోపేతం...
సుష్మా స్వరాజ్ తో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతోనూ టిల్లర్సన్ సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై పోరాటం, అఫ్గానిస్తాన్ లో శాంతిస్థాపన వంటి అంశాల్లో భారత్, అమెరికా ఉమ్మడిగా కృషిచేస్తున్నట్లు సమావేశంలో మోడీ పేర్కొన్నారు. భారత్-అమెరికా సంబంధాల బలోపేతం ఇరుదేశాలపైనేగాక మొత్తం ప్రపంచ స్థిరత్వంపై సానుకూల ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా మోడీ, టిల్లర్సన్ ఉద్ఘాటించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications