ఘోర రోడ్డు ప్రమాదం: 14మంది మృతి, 24మందికి గాయాలు
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా నుంచి ఎటా ప్రాంతం వైపు పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు సరాయ్ నీమ్ వద్దకు రాగానే అదుపు తప్పి కాలువల
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా నుంచి ఎటా ప్రాంతం వైపు పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు సరాయ్ నీమ్ వద్దకు రాగానే అదుపు తప్పి కాలువలో పడిపోయింది.

ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆగ్రా మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తరలించారు.

ట్రక్కు బోల్తా పడడంతో వాహనం కింద చాలా మంది చిక్కుకుపోయారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ నిద్రపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications