తండ్రి, సోదరుడు కలిసి యువతిపై అత్యాచారం: ఉత్తరప్రదేశ్లో దారుణం..
తండ్రి, సోదరుడు, ఇద్దరు బాబాయిలు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా మంగళవారం పోలీసులు తెలిపారు.
ముజఫర్నగర్: ప్రియుడితో వెళ్లిపోయిందన్న కారణంతో కుటుంబ సభ్యులే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ధనేడా గ్రామంలో చోటు చేసుకుంది.
తండ్రి, సోదరుడు, ఇద్దరు బాబాయిలు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టుగా మంగళవారం పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు నలుగురు నిందితుల మీద కేసులు నమోదు చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్(ఎస్ హెచ్ఓ) కుశాల్ పాల్ సింగ్ తెలిపారు. బాధితురాలిని ఓ ఇంట్లో నిర్భంధించి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
కొన్ని నెలల క్రితం యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిపోయిందని, దీన్ని అవమానంగా భావించిన కుటుంబ సభ్యులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications