ఉత్తరాఖండ్ ఫలితాలు: కాంగ్రెస్ కు 48సీట్లు: హరీష్ రావత్; గెలుపు బీజేపీదే: పుష్కర్ సింగ్ ధామి
ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరఖండ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. పార్టీల రాజకీయ భవితవ్యం తేలే నిర్ణయం నేడే వెలువడనుండడంతో రాజకీయ పార్టీలలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి వారు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
Recommended Video

కాంగ్రెస్ కు 48 సీట్లు వస్తాయి: హరీష్ రావత్
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మాట్లాడుతూ, ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని, 70 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ దాదాపు 48 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. వచ్చే 2-3 గంటల్లో అంతా తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలపై నాకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ 48 స్థానాలకు చేరువవుతుందని తాను నమ్ముతున్నాను అని రావత్ అన్నారు.

ఉత్తరాఖండ్ లో హంగ్ అసెంబ్లీకి ఛాన్స్ .. ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషించే ఛాన్స్
ఉత్తరాఖండ్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు మరియు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ పార్టీ వంటి పార్టీలకు ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పెద్ద పాత్ర పోషించే అవకాశాన్ని పెంచుతుంది. 60 స్థానాలకు గాను 40 నుంచి 45 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్లు నేరుగా పోటీ పడుతుండగా, ప్రాంతీయ పార్టీలు 25-30 స్థానాల్లో త్రిముఖ పోరు సాగించాయి.

విజయం తమదే అంటున్న బీజేపీ సీఎం పుష్కర్ సింగ్ ధామి
మరోవైపు అధికార బీజేపీ కూడా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దాని కంటే పార్టీ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని, అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎగ్జిట్ పోల్స్ ఉత్తరాఖండ్లో మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయని చూపించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికంటే మా వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉంటుందని పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. పార్టీ మెజారిటీ సాధిస్తుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. చేసిన పనికి ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారని కచ్చితంగా ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications