రాష్ట్రంలో 'గ్రీన్ సెస్' విధింపు.. అన్ని వాహనాలపై అదనపు ఫీజు..!
రాష్ట్రంలోని పర్యావరణాన్ని కాపాడేందుకు ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణాన్ని కాపాడి.. రాష్ట్రంలో కాలుష్యాన్ని నిర్మూలించేందుకు గ్రీన్ సెస్ ను విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ లోకి ప్రవేశించే ప్రతి వాహనంపై గ్రీన్ సెస్ ను విధించనుంది. గ్రీన్ సెస్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని చెట్లను పెంచడం కోసం వినియోగించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం ద్వారా గాలి నాణ్యత పెరగడం, ఎకో- ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాలకు ఫండింగ్ చేయడం, కాలుష్యం తగ్గిపోవడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
దేవ భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. నూతన పర్యావరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రీన్ సెస్ ను తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతోపాటుగా రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాఖండ్ లోకి ప్రవేశించే అన్ని వాహనాలపై గ్రీన్ సెస్ ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర ఎకో- ఫ్రెండ్లీ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.

గ్రీన్ సెస్ నుంచి వచ్చిన ఆదాయంతో గ్రీన్ ప్రాజెక్ట్స్ కు ఖర్చు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కోసం వినియోగించనుంది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో వాయి కాలుష్యం అధికమవుతున్న నేపథ్యంలో గ్రీన్ సెస్ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రీన్ సెస్ అమల్లోకి వస్తే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ వాయు సురక్షన్-2024 ర్యాంకింగ్స్ లో రిషీకేష్ 14వ స్థానంలో అలాగే డెహ్రాడూన్ 19 వ స్థానంలో ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ సెస్ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏటా రూ. 100 కోట్లు సమకూరుతాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications