తేనెటీగలకు వ్యాక్సీన్.. ప్రపంచంలోనే తొలిసారి... దీన్ని ఎలా ఇస్తారు

ప్రపంచంలోనే తొలిసారిగా తేనెటీగల కోసం వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా దీనికి ఆమోదం పలికింది.
'అమెరికన్ ఫౌల్బ్రూడ్ డిసీజ్’ నుంచి తేనెటీగలు మృత్యువాత పడకుండా ఈ వ్యాక్సీన్ కాపాడుతుంది.
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్(యూఎస్డీఏ) ఈ వ్యాక్సీన్కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు దీని తయారీ సంస్థ యలాన్ యానిమల్ హెల్త్ వెల్లడించింది.
మొక్కల్లో పరాగ సంపర్కానికి సహకరించే జీవులుగా పర్యావరణంలో తేనెటీగల పాత్ర కీలకం.
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- ప్రేమ దాసప్ప: అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?

'తేనెటీగలను బతికించడానికి ఈ వ్యాక్సీన్ కీలకం కానుంది’ అని డలాన్ యానిమల్ హెల్త్ సీఈవో అన్నెట్ క్లైజర్ ఓ ప్రకటనలో తెలిపారు.
రాణి ఈగకు ఈ వ్యాక్సీన్ను ఇవ్వడం ద్వారా లార్వాలు రోగనిరోధక శక్తిని సంతరించుకునేలా చేస్తారు.
అమెరికాలో 2006 నుంచి తేనెటీగల గుంపులు తగ్గిపోతున్నాయని యూఎస్డీఏ గణాంకాలు చెప్తున్నాయి.
తేనెటీగల ఆరోగ్యంపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని.. పరాన్నజీవులు, కీటకాలు, వ్యాధులు, ఏకంగా గుంపులుగుంపులు ఒకేసారి చనిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా వ్యాధులు వంటివన్నీ వాటి మరణానికి కారణమవుతున్నట్లు యూఎస్డీఏ చెప్పింది.
ప్రపంచంలోని పంట ఉత్పత్తులలో మూడో వంతుకు కారణం పరాగ సంపర్కానికి తోడ్పడే తేనెటీగలు, పక్షులు, గబ్బిలాలు వంటివేనని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తోంది.
- తేనెలో కల్తీ: 'చైనీస్ షుగర్ సిరప్లను కలిపి, అమ్మేస్తున్నారు’
- కోవిడ్ వ్యాక్సీన్ల ఫలితాల్లో తేడాలు ఎందుకొస్తున్నాయి? 'సగం డోసు’ ఎక్కువ ఫలితాన్ని ఎలా ఇచ్చింది?

కాగా అమెరికన్ ఫౌల్బ్రూడ్ డిసీజ్ కారణంగా తేనెటీగల పెంపకందారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంతవరకు ఈ వ్యాధికి చికిత్స అనేదే లేదు. అంతేకాదు... ఇది చాలావేగంగా వ్యాపించే వ్యాధి.
ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తిస్తే తేనెటీగలను పెంచే పెట్టెలు, ఈగలు అన్నిటినీ మంటల్లో కాల్చడమే దీనికి పరిష్కారంగా ఉండేది ఇంతవరకు. అలా చేస్తే మిగతావాటికి వ్యాపించకుండా ఆగేది.
ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సీన్లో అమెరికన్ ఫౌల్బ్రూడ్ డిసీజ్కు కారణమయ్యే 'పేనిబాసిల్లస్ లార్వా’ బ్యాక్టీరియానే వాడుతారు. అయితే, అచేతన స్థితిలో ఉండే బ్యాక్టీరియా వ్యాక్సీన్లో ఉంటుందని డలాన్ యానిమల్ హెల్త్ చెప్పింది.

తేనెతుట్టెలోని శ్రామిక ఈగలు రాణి ఈగకు అందించే ఆహారం రాయల్ జెల్లీలో వ్యాక్సీన్ ద్వారా ఈ బ్యాక్టీరియాను ప్రవేశపెడతారు. ఆ ఆహారం ద్వారా రాణి ఈగకు అందే రోగనిరోధక బ్యాక్టీరియా దాని అండాశయాలలోకి చేరుతుందని వ్యాక్సీన్ తయారీ సంస్థ చెప్పింది.
రాణి ఈగ అండాశయాలలోకి వ్యాక్సీన్ చేరడం వల్ల అది లార్వాకు రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని.. దానివల్ల కొత్తగా జన్మించే ఈగలు ఈ వ్యాధిని తట్టుకోగలుగుతాయని చెప్తోంది.
ఈ కొత్త వ్యాక్సీన్ తేనెటీగల పెంపకందారులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు కాలిఫోర్నియా రాష్ట్ర తేనెటీగల పెంపకందారుల సంఘం సభ్యుడు ట్రెవర్ టౌజర్ చెప్పారు.
వ్యాక్సీన్ ఈ ఏడాదే పరిమిత సంఖ్యలో అందుబాటులోకి రానుందని తయారీ సంస్థ డలాన్ వెల్లడించింది.
ఇవి కూడ చూడండి:
- సమ్మెద్ శిఖర్: జైనులకు ఈ ప్రాంతం ఎందుకు అంత పవిత్రం... ఇతర మతస్తులు రాకూడదని వారు కోరుకుంటున్నారా
- ఆనాటి కారు యాక్సిడెంట్లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్రౌండర్స్ అయ్యారు
- న్యూయార్క్ మహా నగరం 'ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications