వందే భారత్ స్పీడ్.. 182: చుక్క నీరు కింద పడితే ఒట్టు (వీడియో)
దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది.
ఈ పరిణామాల మధ్య ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కుతున్నాయి.. క్రమంగా. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కూడా. వివిధ మార్గాల్లో ట్రయల్ రన్ నడుస్తోంది. ఢిల్లీ- వారణాశి, ఢిల్లీ- పాట్నా, ఢిల్లీ- కోటా వంటి.. కొన్ని మార్గాలు ప్రాథమికంగా ఎంపిక అయ్యాయి. ఆయా మార్గాల్లో ట్రయల్ రన్స్ సాగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ బిగ్ అప్ డేట్ ఇచ్చారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.

వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ వేగానికి సంబంధించిన వీడియోను ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. గంటకు 180- 182 కిలో మీటర్ల వేగాన్ని అందుకుందీ ట్రైన్. కోటా-నాగ్డా సెక్షన్లో గంటకు 182 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పరుగులు పెట్టింది. దీన్ని పరీక్షించడానికి వాటర్ టెస్ట్ నిర్వహించారు. నీటితో నింపిన మొత్తం నాలుగు గాజు గ్లాస్ లను దీనికోసం వినియోగించారు. ఒక్క చుక్క నీరు కింద పడకుండా గరిష్టంగా 182 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ దూసుకెళ్లడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.
రైలు లోపలి నుండి మొబైల్ స్క్రీన్పై గంటకు 182 కి.మీ. వరకు దీనీ వేగం నమోదైంది. అంత వేగంలో కూడా డెక్పై అమర్చిన నీటి గ్లాసులు కదలకుండా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఛైర్ కార్ రైళ్ల డిజైన్ వేగం 180 కిలోమీటర్లు. కాగా గరిష్ట ఆపరేషనల్ స్పీడ్ 160 కిలోమీటర్లుగా రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. రైలు సగటు వేగం ట్రాక్ జామెట్రీ, మెయింటెనెన్స్, స్టాప్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం 16 కోచ్లతో వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. 800-1100 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఆటోమేటిక్ డోర్స్, టచ్ ఫ్రీ బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, యూఎస్బీ ఛార్జింగ్, వైఫై, సీసీటీవీ కెమెరాలు, మాడ్యులర్ కిచెన్, కవచ్ సేఫ్టీ సిస్టమ్, క్రాష్ రెసిస్టెంట్ డిజైన్ తో ఇవి రూపుదిద్దుకుంటోన్నాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications