నేవీ చీఫ్ నియామకంపై వైస్ అడ్మిరల్ అభ్యంతరం : ఆర్మీ ఫోర్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన విమల్ వర్మ
న్యూఢిల్లీ : అండమాన్ నికోబార్ దీవుల కమాండర్ ఇన్ చీఫ్ కమాండ్ వైస్ అడ్మిర్ విమల్ వర్మ ఆర్మీ ఫోర్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. తనకు సీనియారిటీ ఉన్న ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలుపాలని ఆయన ట్రిబ్యునల్ మెట్లు ఎక్కారు.
తదుపరి నేవీ చీఫ్ కరమ్ బీర్ సింగ్
గతనెలలో నేవీ చీఫ్ పదవీకి వైస్ అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ పేరును కేంద్ర ప్రభుత్వం ప్రాతిపదించింది. మే 30వ తేదీన ప్రస్తుత నేవీ చీఫ్ సునీల్ లాంబా పదవీకాలం ముగుస్తోండటంతో కమర్ పేరును కన్ఫామ్ చేసింది.

మెరిట్ ప్రాతిపదికన ఎంపిక
నేవీ చీఫ్ పోస్టు అధిపతి పేరును మెరిట్ లిస్ట్ ప్రాతిపదికన ఎంపికచేశామని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత సాంప్రదాయల ప్రకారం సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని స్పష్టంచేసింది. వాస్తవానికి వర్మ .. కరమ్ కన్నా సీనియర్ అయినందున .. తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. వర్మ పిటిషన్ను మంగళవారం ట్రిబ్యునల్ విచారించే అవకాశం ఉంది. వర్మతోపాటు వైస్ అడ్మిరల్ జీ అశోక్ కుమార్, నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ అజిత్ కుమార్, అనిల్ కుమార్ చావ్లా కూడా సీనియారిటీ జాబాతాలో ఉన్నారు. అయితే 2016 నుంచి సీనియారిటీ ప్రాతిపదికన నేవీ చీఫ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం లేదు.












Click it and Unblock the Notifications