"అణచివేయాలని కుట్ర.. అయినా నో కాంప్రమైజ్"
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అరవ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాట అధికారాన్ని నిలుపుకునేందుకు డీఎంకే- కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తున్నాయి. తిరిగి అధికారం పొందేందుకు ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్.. విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఈసారి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ చుట్టూనే ప్రస్తుతం తమిళ రాజకీయాలు తిరుగుతున్నాయి. తొలిసారిగా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరూర్ తొక్కిసలాట దగ్గరినుంచి రజనీకాంత్ ఎపిసోడ్ వరకూ విజయ్ వెంట వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా టీవీకే పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకలో విజయ్ పాల్గొన్నారు.
రంజాన్ సందర్భంగా తమిళనాడులోని మహాబలిపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి అన్ని మతాలు సమానం అని.. అన్ని మతాల విశ్వాసాలను కాపాడటంలో టీవీకే పార్టీ కాంప్రమైజ్ అవ్వదని తెలిపారు. తమిళనాడులో ఒంటరిగానే పోటీ చేస్తామని వివరించారు. ఎన్డీయే కూటమిలోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
తాము ఎవరి టీమ్ కాదని.. ప్రజల టీమ్ అని విజయ్ పేర్కొన్నారు. టీవీకే లీడర్ షిప్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఉంటుందని విజయ్ క్లారిటీ ఇచ్చారు. సామాజిక న్యాయం, సెక్యూలరిజంపై కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని విజయ్ తేల్చి చెప్పారు. రకరకాలుగా తమను అణచివేయాలని కొన్ని శక్తులు ప్లాన్ చేస్తున్నాయని.. అది సాధ్యం కాకపోవడంతో తమపై ఫేక్ ప్రచారం నిర్వహిస్తున్నాయని విజయ్ మండిపడ్డారు.

ప్రజా ప్రభుత్వాన్ని త్వరలోనే అమలు చేస్తామని అందులో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు పొత్తుపై మరోసారి విజయ్ క్లారిటీ ఇచ్చారు. సింగిల్ గానే పోటీ చేస్తామని తమకు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలతో పొత్తు లేదని తేల్చారు. దేవుడి దయతో అనుకున్న టార్గెట్ ను సాధిస్తామని అన్నారు.
-
థాయ్ లాండ్ లో రష్మిక, విజయ్ హనీమూన్.. ఫోటో వైరల్..! -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications