మాల్యాకు కఠిన షరతులతో కూడిన బెయిల్.. ఏంటవి?
మొబైల్ పోన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంచాలి, ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు, ట్రావెల్ డాక్యుమెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవద్దు, వంటి షరతులను కోర్టు మాల్యాకు విధించింది.
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి లండన్ లో అరెస్టయిన విజయ్ మాల్యా.. ఆపై బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. కఠినమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
షరతుల వివరాలను పరిశీలిస్తే.. మొబైల్ పోన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంచాలి, ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు, ట్రావెల్ డాక్యుమెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవద్దు, వంటి షరతులను కోర్టు మాల్యాకు విధించింది. కాగా, ఈ నెల 18న స్కాట్లాండ్ యార్డు పోలీసులు మాల్యాను అరెస్టు చేయగా.. ఆపై మూడు గంటల్లోనే మాల్యా బెయిల్ పై బయటకొచ్చాడు.

బ్యాంకులకు 9వేల కోట్లు ఎగవేసి గతేడాది మార్చి 2న చెప్పా పెట్టకుండా మాల్యా లండన్ పారిపోయారు. అప్పట్నించి అతన్ని వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చివరగా విజయ్ మాల్యాను అప్పగించాలని కోరుతూ భారత్ ఫిబ్రవరి 2న బ్రిటన్ హోం శాఖకు దరఖాస్తు చేసుకుంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications