మాల్యాకు కఠిన షరతులతో కూడిన బెయిల్.. ఏంటవి?
మొబైల్ పోన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంచాలి, ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు, ట్రావెల్ డాక్యుమెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవద్దు, వంటి షరతులను కోర్టు మాల్యాకు విధించింది.
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి లండన్ లో అరెస్టయిన విజయ్ మాల్యా.. ఆపై బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ను వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. కఠినమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
షరతుల వివరాలను పరిశీలిస్తే.. మొబైల్ పోన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంచాలి, ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు, ట్రావెల్ డాక్యుమెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవద్దు, వంటి షరతులను కోర్టు మాల్యాకు విధించింది. కాగా, ఈ నెల 18న స్కాట్లాండ్ యార్డు పోలీసులు మాల్యాను అరెస్టు చేయగా.. ఆపై మూడు గంటల్లోనే మాల్యా బెయిల్ పై బయటకొచ్చాడు.
బ్యాంకులకు 9వేల కోట్లు ఎగవేసి గతేడాది మార్చి 2న చెప్పా పెట్టకుండా మాల్యా లండన్ పారిపోయారు. అప్పట్నించి అతన్ని వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చివరగా విజయ్ మాల్యాను అప్పగించాలని కోరుతూ భారత్ ఫిబ్రవరి 2న బ్రిటన్ హోం శాఖకు దరఖాస్తు చేసుకుంది.