వీడియో: ఎమ్మెల్యేను ఈడ్చి కొట్టిన మహిళ
చండీగఢ్: భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.
హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ.. భారీ వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. ఆయా నదులపై నిర్మించిన బాస్పా, వాంగ్టో, నథ్పా రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకోవడంతో గేట్లన్నింటినీ ఎత్తివేశారు అధికారులు. దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది.

బియాస్, రావి, సట్లేజ్ నదుల తీరప్రాంతాలన్నీ మునిగిపోయాయి. పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగి పడటంతో అటు రోడ్లు కూడా ఎక్కడికక్కడ ధ్వంసం అయ్యాయి. కొండ ప్రాంతాల్లో ఉండే రోడ్లే కాకుండా.. జాతీయ రహదారులు సైతం భారీ ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఇక వంతెనల గురించి చెప్పుకోనక్కర్లేదు.
అటు హర్యానాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ను ఆనుకుని ఉన్న హర్యానాలో పలు జిల్లాలు వరదముంపునకు గురయ్యాయి. ప్రత్యేకించి అంబాలా, పంచ్కుల, కురుక్షేత్ర, కర్నాల్, యమునానగర్, పానిపట్, కైథల్.. జిల్లాలు వరదల బారిన పడ్డాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది.
#WATCH | Haryana: In a viral video, a flood victim can be seen slapping JJP (Jannayak Janta Party) MLA Ishwar Singh in Guhla as he visited the flood affected areas
— ANI (@ANI) July 12, 2023
"Why have you come now?", asks the flood victim pic.twitter.com/NVQmdjYFb0
కైథల్ జిల్లాలో ఈ సాయంత్రం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గుహ్లాలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన శాసన సభ్యుడు ఈశ్వర్ సింగ్కు చేదు అనుభవం ఎదురైంది. వరద బాధితురాలు ఒకరు ఆయనపై చేయి చేసుకున్నారు. ఇప్పుడు తీరిగ్గా వస్తోన్నావా? అంటూ నిలదీసిన ఆమె అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యేను ఈడ్చి కొట్టారు.
జన్నాయక్ జనతా పార్టీకి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయనను స్థానికులు నిలదీశారు. వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటోన్నామంటూ ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారు వినిపించుకోలేదు. మాట్లాడుతుండగానే ఓ మహిళ ఆయన చెంప పగులగొట్టారు. దీనితో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications