పన్నీర్ కు కన్నీరే మిగిలింది: రహస్య సమావేశం, ఇప్పుడు ఏం చేద్దాం?
చెనై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు శనివారం మద్యాహ్నం అత్యవసరంగా సమావేశం అయ్యారు. చెన్నైలోని ఓ రహస్య ప్రాంతంలో పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశం అయ్యారని తెలిసింది.
తమిళనాడు సీఎంగా శశికళ: ఫిబ్రవరి 6 ముహూర్తం ! పన్నీర్ ?
చిన్నమ్మ శశికళను తమిళనాడు సీఎంగా చెయ్యాలని ఆమె అనుచరులు ఒంటికాలి మీద నిలబడ్డారు. ఆదివారం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ సమావేశమై శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకోవడానికి రంగం సిద్దం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం తన అధికార పర్యటనలు కుదించుకున్నారని సమాచారం. వెంటనే తనకు అందుబాటులో ఉన్న మంత్రులతో పన్నీర్ సెల్వం చర్చలు జరిపారని తెలిసింది. అయితే ఆదివారం శాసన సభ్యులు శశికళను సీఎంగా ప్రకటించకముందే ఓ నిర్ణయం తీసుకోవాలని పన్నీర్ సెల్వం తన సన్నిహితులకు చెప్పారని తెలిసింది.
శశికళ తమిళనాడు సీఎం అయితే, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఏం చెప్పారంటే !
శశికళ అనుచరులు సీఎం పగ్గాలు చిన్నమ్మకు అప్పగించాలని ఒత్తిడి చెయ్యకముందే తాను రాజీనామా చేస్తే మంచిదని పన్నీర్ సెల్వం భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో తనకు అనుకూలంగా ఉన్న మంత్రులతో పన్నీర్ సెల్వం ఈ విషయంపై చర్చించాలని ఆయన అనుచరులు పట్టుపట్టారని తెలిసింది.
తమిళనాడు సీఎంగా శశికళ బాధ్యతలు స్వీకరిస్తే పన్నీర్ సెల్వంకు ఏ పదవి కేటాయిస్తారు ? ఆయనను మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకుంటారా ? లేదా ? పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మంత్రుల మీద వేటు వేస్తారా ? అంటూ ఇప్పుడు తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది.