ఐఆర్సీటీసీ ‘లక్కీ ఛాన్స్’: రూ.10వేలు గెలుచుకునే అవకాశం
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే, ఐఆర్సీటీసీ ప్రయాణికులకు ఓ లక్కీ ఛాన్స్ ఆఫర్ అందిస్తున్నాయి. ఐఆర్సీటీసీ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు రూ. 10వేలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆధార్ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ లక్కీ డ్రా స్కీమును ప్రవేశపెట్టాయి.
లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఐఆర్సీటీసీ వారి మొబైల్ నెంబర్కు మెసేజ్ ద్వారా తెలియజేస్తుంది. ఈ స్కీం ప్రకారం ప్రయాణికులు ఎవరైతే ఐఆర్సీటీసీ ద్వారా టిక్కెట్ తీసుకుంటారో వారు తమ ఐఆర్సీటీసీ యూజర్ ఐడీకి తమ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా వారికి లక్కీ డ్రాలో పాల్గొనే అర్హత లభిస్తుంది.

మే రెండో వారంలో ప్రయాణించే వారి నుంచి ఐదుగురిని ఎంపిక చేసి రూ. 10వేలు అందించనున్నారు. అంతేగాక, వారి రైలు ప్రయాణ టిక్కెట్టుకు అయిన మొత్తం ఖర్చులను సైతం వెనక్కి ఇచ్చేస్తారు. అయితే, దీనికి ఐఆర్సీటీసీలో నమోదు చేసుకున్న వారే అర్హులు.
కేవైసీకి తమ ఆధార్ను అనుసంధానం చేసుకుని ఉండాలి. టిక్కెట్లో పేర్కొన్న ప్రయాణికుల జాబితాలో కనీసం ఒక్క పేరుతో అయినా ఐఆర్సీటీసీ అకౌంట్ ప్రొఫైల్ పేరు లేదా ప్రయాణికుడుి పేరు సరిపోవాలి. అయితే, తమ టిక్కెట్ రద్దు చేసుకున్నా.. లేదా టీడీఆర్ ఫైల్ చేసుకున్నా.. ఆ ప్రయాణికులు ఈ స్కీంకు అనర్హులే.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications