రన్నింగ్ ట్రైన్ నుంచి దిగుతూ ప్రాణాలు కోల్పోయిన మహిళ (వీడియో)
ముంబై: ముంబైలోని బొరివలి రైల్వే స్టేషన్లో జనవరి 15న తేదీన దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు బుధవారం వెలుగు చూసిన సీసీటీవీ పుటేజీ ఆ షాకింగ్ యాక్సిడెంట్ను తెలియజేసింది. ఈ ఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
వివరాల్లోకి వెళితే ఈ నెల 15న తేదీన ఉదయం 4 గంటల ప్రాంతంలో బొరివలి రైల్వేస్టేషన్కు వచ్చిన ఓ రైలు ప్లాట్ఫామ్ మీద నెమ్మదిగా ప్రయాణిస్తుంది. స్టేషన్లో రైలు ఆగదనుకున్నారో? ఏమో తెలియదు కానీ, కొంత మంది కదులుతున్న ట్రైన్ నుంచే దిగడం ప్రారంభించారు.
తనతో పాటు వస్తున్న ఓ మహిళను రైలు నుంచి కిందకు దించుకునేందుకు ఓ యువకుడు వ్యక్తి డోర్ వద్ద నిలబడ్డాడు. డోర్ వద్దకు వచ్చిన మహిళకు చేయిచ్చిన అతడు ఆమెను కిందకు కూడా దించే క్రమంలో రన్నింగ్ ట్రైన్ కావడంతో ఆ మహిళ పట్టు తప్పింది.
నిలబడలేక కింద పడిపోయింది. ఈలోగా ఆమెకు చేయందించిన ఆ యవకుడు చేసిన యత్నాలు ఫలించలేదు. క్షణాల్లో ఆమె రైలు, ఫ్లాట్ ఫాం మధ్యనున్న సందులో కిందకు పడిపోయింది. ముందుగా తల అందులో పడగా, ఆమె కాళ్లను పట్టుకుని లాగేందుకు పురుషుడు చేసిన యత్నాలు కూడా ఫలించలేదు.
ఆమె పై గుండా రైలు వెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రైలు ఆగిన తర్వాత ఆమెను పైకి తీసి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనలో మృతి చెందిన ఆమెను కిరణ్ దేవి కొఠారిగా పోలీసులు గుర్తించారు.