ఏ పార్టీకీ భయపడం: మోడీ వారణాసి ర్యాలీపై ఈసి
న్యూఢిల్లీ: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతి నిరాకరించడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) సంపత్ సమర్థించుకున్నారు. భద్రత విషయంలో స్థానిక అధికారుల మాటలను విస్మరించలేమని ఆయన అన్నారు. తాము నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి గానీ, ఎవరికి గానీ భయపడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా పోలింగ్ సజావుగాీ జరుగుతున్న నేపథ్యంలో తమపై విమర్శలు చేయడం బాధాకరమని ఆయన అన్నారు. రాజ్యాంగబద్దమైన ఈసి గురించి మాట్లాడేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా పరిపక్వతను ప్రదర్శించాలని ఆయన సూచించారు. ఈసిపై అనుమానాలు లేవనెత్తడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

ఫిర్యాదుల విషయంలో ఈసిపై అనుమానాలు అక్కరలేదని, రాజకీయ పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. రిటర్నింగ్ అధికారులను మారుస్తున్నామన్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. రాజ్యాంగ విలువల పరిరరక్షణకు ఈసి కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ విషయంలో నివేదిక కోరినట్లు తెలిపారు. తాము నిజాయితీగా, ధైర్యంగా పనిచేసుకుని పోతామని ఆయన అన్నారు.
కాగా, ఈసి నిర్ణయానికి వ్యతిరేకంగా బిజెపి వారణాసిలో ఆందోళనకు దిగింది. చాలా ప్రాంతాల్లో తాను సమావేశాలు పెట్టానని, వారణాసిలోనే భద్రత సమస్య ఎదురవుతుందా అని నరేంద్ర మోడీ అడిగారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications