వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తర్వాత నిజమైన దాడులు, వదిలిపెట్టరు: కేజ్రీవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల తర్వాత తమపై నిజమైన దాడులు జరుగుతాయని భావిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ చీప్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిజెపిని ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఓ పుస్తకం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.

ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంపై తనపై, తమ పార్టీ నాయకులపై గుడ్ల దాడులు, చెప్ప దెబ్బల వంటివి జరిగాయని ఆయన అన్నారు. అంతకన్నా పెద్ద దాడులు ఎన్నికలు ముగిసే వరకు జరగవని, అలా జరిగితే పరిస్థితి ఎదురు తిరుగుతుందని ఆయన అన్నారు.

We expect real attacks after election: Kejriwal

నిజమైన దాడులు ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతాయని, వారు తమను వదిలిపెట్టబోరని ఆయన అన్నారు. కేజ్రీవాల్ తన ప్రసంగంలో బిజెపి పేరు ఎత్తలేదు. అయితే, బిజెపిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడరనేది మాత్రం అర్థమవుతోంది.

అధికారంలోకి రావడానికి వారు ఏమైనా చేస్తారని ఆయన అన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారు చాలా శక్తివంతులని, వారు కేవలం ధనబలంతో మాత్రమే పోటీ చేయడం లేదని ఆయన అన్నారు. సత్యపథం అవసరమని, ఢిల్లీలో ఎన్నికలు అలాగే జరిగాయని ఆయన అన్నారు.

English summary
In remarks clearly directed at the BJP, AAP leader Arvind Kejriwal said Monday that he expected "real attacks" on his party after the Lok Sabha election
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X