నేపాలీ మహిళలపై రేప్: భారత్ వదిలిపోయిన సౌదీ అంబాసిడర్
న్యూఢిల్లీ: భారత్లోని సౌదీ దౌత్య కార్యాలయం అధికారి గురువారం భార్యతో కలిసి భారత్ వదిలి సౌదీ అరేబియాకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇద్దరు నేపాలీ మహిళలను నిర్భందించి, వారిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సౌదీ అంబాసిడర్పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు భారత్ వదిలి వెళ్లిపోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సౌదీ అరేబియా అంబాసిడర్ తమను గుర్గావ్లో నిర్భంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ నేపాల్కు చెందిన తల్లీ కూతుళ్లు ఆరోపించిన ఘటన బుధవారం సంచలనం సృష్టించింది.

ఓ స్వచ్చంద సంస్ధ ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన అధికారులు సౌదీ అంబాసిడర్ వద్ద బందీలుగా ఉన్న నేపాలీ మహిళలను విడిపించిన స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ దర్యాప్తు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైప్ సౌదీ అంబాసిడర్పై వచ్చిన ఆరోపణలను సౌదీ ఖండించింది. వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందంటూ ఆరోపించింది. గుర్గాన్లోని లీలా అంబియెన్స్లోగల కైట్రియోనా అపార్ట్మెంట్లో ఇద్దరు నేపాలీ మహిళలు నిర్భంధంలో ఉన్నారని మైటీ ఇండియా అనే స్వచ్చంధ సంస్ధ ఈ నెల 7వ తేదీన స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను కాపాడి, వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications