వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాలీ మహిళలపై రేప్: భారత్ వదిలిపోయిన సౌదీ అంబాసిడర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లోని సౌదీ దౌత్య కార్యాలయం అధికారి గురువారం భార్యతో కలిసి భారత్ వదిలి సౌదీ అరేబియాకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇద్దరు నేపాలీ మహిళలను నిర్భందించి, వారిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సౌదీ అంబాసిడర్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు భారత్ వదిలి వెళ్లిపోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సౌదీ అరేబియా అంబాసిడర్ తమను గుర్గావ్‌లో నిర్భంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ నేపాల్‌కు చెందిన తల్లీ కూతుళ్లు ఆరోపించిన ఘటన బుధవారం సంచలనం సృష్టించింది.

We were raped every night, say Nepali women rescued from Saudi diplomat's house

ఓ స్వచ్చంద సంస్ధ ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన అధికారులు సౌదీ అంబాసిడర్ వద్ద బందీలుగా ఉన్న నేపాలీ మహిళలను విడిపించిన స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ దర్యాప్తు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.

మరోవైప్ సౌదీ అంబాసిడర్‌పై వచ్చిన ఆరోపణలను సౌదీ ఖండించింది. వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందంటూ ఆరోపించింది. గుర్గాన్‌లోని లీలా అంబియెన్స్‌లోగల కైట్రియోనా అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు నేపాలీ మహిళలు నిర్భంధంలో ఉన్నారని మైటీ ఇండియా అనే స్వచ్చంధ సంస్ధ ఈ నెల 7వ తేదీన స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను కాపాడి, వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.

English summary
Tormented by poverty in Nepal, they were ready to take any risk, even if it meant moving out of the country. They knew life would be difficult, but they hardly anticipated it would turn out this way. Gangrape, unnatural sex and dire threats – they claim to have endured it all before being rescued from the horror house in posh Gurgaon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X