కర్నాటక ఎన్నికలు: సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు, ఏ పార్టీకి మెజార్టీ రాలేదు, అందుకే
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము జేడీఎస్కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇదివరకే దేవేగౌడతో మాట్లాడామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. జేడీఎస్కు మేం మద్దతిస్తున్నామని చెప్పారు.
Recommended Video

Karnataka Assembly Elections 2018 Result Updates (Video)
కర్నాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్వర మాట్లాడుతూ.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ కలిసి కట్టుగా ఉందన్నారు. ఏ పార్టీ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేదన్నారు. జేడీఎస్కు బయటి నుంచి మద్దతిస్తామని చెప్పారు.

గవర్నర్ వద్దకు పోటాపోటీగా
జేడీఎస్, కాంగ్రెస్ సభ్యులు సాయంత్రం గవర్నర్ను కలవనున్నారు. మరోవైపు యెడ్యూరప్ప కూడా గవర్నర్ను కలవనున్నారు. తమకు ఎక్కువ స్థానాలు వచ్చాయని ఆయన చెప్పనున్నారు.












Click it and Unblock the Notifications