భార్య స్నేహితురాలిపై రేప్: ఫొటోలు, వీడియోలు తీసి ఏడాదిపాటు..
పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త తన భార్య స్నేహితురాలిపై కన్నేశాడు. భార్యకు తెలియకుండానే ఆమె స్నేహితురాలికి శీతలపానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్త తన భార్య స్నేహితురాలిపై కన్నేశాడు. భార్యకు తెలియకుండానే ఆమె స్నేహితురాలికి శీతలపానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిపాటు అఘాత్యాన్ని కొనసాగించాడు. అంతేగాక, ఆమెకు రెండుసార్లు అబార్షన్లు కూడా చేయించాడా దుర్మార్గుడు.
చివరకు నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన 30ఏళ్ల బాధిత యువతి ఉన్నత చదువుల కోసం కోల్కతాకు వచ్చింది. తన స్నేహితురాళ్లతో కలిసి జోధ్పూర్ గార్డెన్స్లో జరిగిన ఓ ఫంక్షన్ కు వెళ్లింది. అక్కడే తన స్నేహితుడి ద్వారా కోల్కతాకు చెందిన నిందిత వ్యాపారవేత్త రాకేష్ చౌదరి దంపతులకు పరిచయమైంది.
ఆ తర్వాత రాకేష్ భార్య, ఆ మహిళ మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో పెళ్లి కాని మహిళపై కన్నేసిన రాకేష్.. తన భార్య లేని రోజున ఆ మహిళను ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి వచ్చిన ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. బాధితురాలు మత్తులోకి జారుకున్న తర్వాత.. కోల్కతాలోని బైపాస్ రోడ్డులో ఉన్న తన గెస్ హౌజ్కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెకు మద్యం తాగించి స్పహ కోల్పోయాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో ఆమె ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత తాను పిలిచిన ప్రతీసారి రాకుంటే ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులకు గురిచేస్తూ ఏడాదిపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, రెండుసార్లు ఆమెకు గర్భస్రావం చేయించాడు. అతని బాధలు భరించలేని బాధితులకు చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.