వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్‌లో విషాదం: పేపర్ మిల్లులో ఆరుగురు కార్మికులు మృతి

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లోని హాజీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో విషవాయువులు పీల్చి ఆరుగురు కార్మికులు మృతి చెందారు.గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పేపర్ మిల్లులో ఓ పాడుబడ్డ బావి ఉంది. చాలా కాలంగా అది వ్యర్థాలతో నిండిపోయి ఉంది. మిల్లుకు నీటిని సరఫరా చేసే పంపులు ఈ బావిలోనే ఉన్నాయి. ఇటీవల నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో.. కొంతమంది కార్మికులు బావి లోపలికి దిగి పరిశీలించారు. ఈ క్రమంలో అందులోని విషవాయువులను పీల్చుకోవడంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

West Bengal: Six workers dead after inhaling toxic gas in paper mill

వాళ్లను కాపాడటానికి లోపలికి దిగిన మరికొందరు కార్మికులు కూడా విషవాయువులను పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అధికారులు అప్రమత్తమై వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే వారు మృతి చెందారని డాక్టర్లు నిర్దారించారు. మృతులను అశోక్ బోరల్, విజయ్ బర్మా, అమిత్ యాదవ్, ఉదయ్ రాజ్, మిథున్, మహమ్మద్ నజీంగా గుర్తించారు.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. కార్మికులకు గ్యాస్ మాస్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

English summary
In a tragic incident, six workers have died after inhaling toxic gas in West Bengal. The mishap happened in Hajinagar, in North 24 Pargana district of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X