60 మంది పసికందుల దుర్మరణం !ఆస్పత్రిలో ఏం జరుగుతోంది?

పసిపాపల కిలకిల నవ్వులతో సందడిగా ఉండాల్సిన ఆస్పత్రి వార్డులు.. కంటిపాపలను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరుగుతున్న ఘోరాలు వైద్యరంగాన్నే తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఏకంగా 60 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఆస్పత్రి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే ఒక్క రోజులో 10 మంది చిన్నారులు కన్నుమూయడం ఇక్కడి వ్యవస్థల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

విషాదానికి ప్రధాన కారణాలేంటి?

ఆగస్టు నెల రెండవ వారంలో ఒకే రోజు 10 మంది చిన్నారులు చనిపోవడంతో ఈ దారుణం బయటపడింది. ఇందులో ఎనిమిది మంది పసికందులు వేరే చిన్న ఆస్పత్రుల్లో జన్మించగా, పరిస్థితి బాగా విషమించిన తర్వాతే మాల్దా మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. మిగిలిన ఇద్దరు శిశువులు ఇదే ఆస్పత్రిలో జన్మించారు. ఊపిరితిత్తుల సమస్యలు, తీవ్రమైన కామెర్లు, పుట్టుకతో వచ్చిన గుండె సంబంధిత వ్యాధులతోనే ఎక్కువ మంది చిన్నారులు కన్నుమూసినట్లు వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు.

West Bengal Tragedy 60 Infants Die in 3 Weeks at Malda Medical College Probe Launched by Health Dept
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు మృతి
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు మృతి

చిన్న ఆస్పత్రుల రిఫరల్ నిర్లక్ష్యమే శాపమా?

మొత్తం చనిపోయిన 60 మంది శిశువుల్లో దాదాపు 44 మంది బయటి ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల నుంచే ఇక్కడికి రిఫర్ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. చిన్న ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్యం సరిగ్గా అందక, వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత చివరి నిమిషంలో మెడికల్ కాలేజీకి పంపడమే ఈ మరణాలకు ప్రధాన కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటివరకు ఆ చుట్టుపక్కల ఉన్న 16 ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విచారణ వేగవంతం చేశారు.

10 <strong>మంది నవజాతా శిశువులు సజీవ దహనం- యోగి సర్కార్ ఏం చేస్తోంది?</strong>
10 మంది నవజాతా శిశువులు సజీవ దహనం- యోగి సర్కార్ ఏం చేస్తోంది?

ఉన్నతాధికారుల ఆరా.. విచారణకు ఆదేశం

ఒకే ఆస్పత్రిలో ఇంతమంది పసికందులు చనిపోవడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనా స్థలం నుంచి సమగ్ర నివేదిక ఇవ్వాలని మాల్దా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసేన్‌జిత్ బార్‌ను ఆదేశించింది. మరోవైపు ఈ దారుణంపై మాల్దా జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. పసిపిల్లల వరుస మరణాలకు ఆస్పత్రి యాజమాన్య వైఫల్యమా లేక ప్రైవేట్ కేంద్రాల అలసత్వమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+