234 రోజుల తరువాత శశికళ జైలు నుంచి తమిళనాడు: పోయెస్ గార్డెన్ లో అడుగుపెడుతారని !
ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఐదు రోజులు పెరోల్ మీద బయటకు వస్తున్న చిన్నమ్మ శశికళ నటరాజన్ ఇప్పుడు ఏం చేస్తారు ? అంటూ అన్నాడీ
Recommended Video

చెన్నై: ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఐదు రోజులు పెరోల్ మీద బయటకు వస్తున్న చిన్నమ్మ శశికళ నటరాజన్ ఇప్పుడు ఏం చేస్తారు ? అంటూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
234 రోజుల తరువాత శశికళ జైలు నుంచి బయటకు వచ్చి తమిళనాడులో అడుగుపెడుతున్నారు. శశికళ పోయెస్ గార్డెన్ లో అడుగుపెట్టకుండా చూడటానికి చెన్నై నగర పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. పోయెస్ గార్డెన్ దగ్గర అదనపు బలగాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

జయలలిత మరణించిన తరువాత అమ్మకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలోనే శశికళ ఉన్నారు. శశికళ జైలుకు వెళ్లిన తరువాత టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులు వేదనిలయంలో ఉన్నారు. వేదనిలయంలో రాత్రి పూట అరుపులు, కేకలు వినిపిస్తున్నాయని టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పెరోల్ మీద బయకు వస్తున్న శశికళ పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తారని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఇప్పుడు చర్చలు మొదలుపెట్టారు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం అమ్మ స్మారకభవనం చేస్తామని కొంత కాలం క్రితం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications