ఎవరీ బంగారు నిధి స్వామి?: అఖిలేష్‌పై ముందే జోస్యం

Who is Shobhan Sarkar?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని దౌండియా ఖేరా గ్రామంలోని ఓ కోట కింద వెయ్యి టన్నుల బంగారం ఉందని చెప్పిన సాధువు శోభన్ సర్కారు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆ సాధువు 2012లో ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఏర్పడుతుందని ముందే జోస్యం చెప్పారట. శోభన్ సర్కార్ వయస్సు అరవై ఏళ్లుకు పైనే. ఇతను తాను హనుమాన్ భక్తుడిగా చెబుతారు.

శోభన్ ఆశ్రమం కాన్పూర్‌కు ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలోని శోభన్ గ్రామం ప్రాంతంలో ఉంది. అక్కడ రామ, హనుమాన్ మందిరాలు ఉన్నాయి. భక్తులు ఇతనిని స్వామీజి, సర్కార్, భగవాన్ అని పిలుస్తుంటారు.

సాధువు శోభన సర్కార్ కాన్పూర్‌నగర్ జిల్లాలోని మంధనపట్నంలో బిపిఎంజీ ఇంటర్ కాలేజ్‌లో విద్యాభ్యాసం చేశారు. చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక భావాల వైపు ఆకర్షితుడైన ఆయన చదువుకునే రోజుల్లోనే శ్రద్ధగా గీతాపఠనం, రామ్‌చరిత మానస్ అధ్యయనం చేసేవారని స్థానికులు చెబుతున్నారు.

హైస్కూల్ చదువు పూర్తయ్యాక ఇల్లు వదిలి వెళ్లిపోయి స్వామి సత్సంగానంద్ వద్ద శిష్యరికం చేశారు. ఆయనను అందరూ 'బడేస్వామి'గా వ్యవహరించేవారు. ఎనిమిదేళ్లపాటు బడేస్వామి వద్ద శిష్యుడిగా ఉన్న శోభన్ సర్కార్ తర్వాత సొంతంగా ఆశ్రమం నిర్మించుకున్నారు. దానికి అనుబంధంగా ఉన్న గ్రామాలన్నిటికీ రోడ్లను నిర్మించారు.

పలు గ్రామాల్లో దేవాలయాలు నిర్మించి ధర్మ ప్రచారం చేశారు. ప్రస్తుతం శోభన్ సర్కార్‌కు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు ఆశ్రమాలున్నాయి. మీడియా ముందుకు రావడానికి ఆయన ఇష్టపడరంట. ఇన్నాళ్లుగా ఆయన తరఫున శిష్యుడు ఓంజీ మాత్రమే మీడియాకు వివరాలు అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+