ఆర్కె నగర్ ఫలితాలు: తమిళనాడు రాజకీయాలపై ప్రభావం, ఎవరీ దినకరన్?
చెన్నై:ఆర్కె నగర్ ఉప ఎన్నికల ఫలితాలతో మరోసారి టీటీవి దినకరన్ పేరు చర్చనీయాంశమైంది. తమిళనాడు రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం టీటీవి దినకరన్ గురించి చర్చ సాగుతోంది.తమిళనాడు రాజకీయాలపై ఈ ఫలితం ప్రభావం కన్పించే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. అసలు దినకరన్ ఎవరనే విషయాన్ని తెలుసుకొందాం.
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అన్నాడిఎంకెపై కూడ ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే కొందరు మంత్రులు స్వరం మార్చారు. దినకరన్కు మద్దతుగా మాట్లాడడం ప్రారంభించారు.ఈ పరిణామాలను పరిశీలిస్తే తమిళనాడులో మరోసారి రాజకీయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

ఎవరీ దినకరన్?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో మరోసారి దినకరన్ పేరు తెరమీదికి వచ్చింది. జయలలిత బతికున్న సమయంలో తన ఇంటి నుండి దినకరన్ను బయటకు పంపారనే ప్రచారం సాగుతోంది.శశికళ జైలుకు వెళ్ళే సమయంలో అన్నాడిఎంకె పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ను నియమించింది. అయితే శశికళను, దినకరన్ను పళనివర్గం పార్టీ నుండి బహిష్కరించింది. పన్నీర్ సెల్వం ఒక్కటిగా నిలిచారు.దినకరన్ శశికళకు మేనల్లుడు. థేని జిల్లాకు చెందిన ఆయనకు భాస్కరన్, సుధాకరన్ అనే ఇద్దరు సోదరులున్నారు.సుధాకరన్ను జయలలిత దత్తపుత్రుడిగా స్వీకరించారు.ఆ తర్వాత దూరం పెట్టారు.

దినకరన్ను దూరం పెట్టిన జయ
జయలలిత బతికున్న సమయంలో దినకరన్ను దూరం పెట్టారు.పార్టీ వ్యవహరాలు, ప్రభుత్వ వ్యవహరాల్లో దినకరన్ జోక్యం చేసుకొంటున్నట్టు ఆరోపణలు రావడంతో జయలలిత దినకరన్ను దూరం పెట్టారని చెబుతుంటారు.గతంలో దినకరన్ అన్నాడిఎంకె తరపున రాజ్యసభ, లోక్సభలకు ప్రాతినిథ్యం వహించారు.

దినకరన్పై ఈడీ కేసులు
గతంలో దినకరన్పై ఈడీ కేసులు నమోదు చేసింది. 1991-95 దినకరన్ ఖాతాల్లో భారీగా డబ్బులు డిపాజిట్ చేసినట్టు గుర్తించినత ఈడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. అయితే విదేశీ మారకద్రవ్యం నిబంధనల ఉల్లంఘన కింద ఈ కేసు నమోదైంది.

మరోసారి దినకరన్ చక్రం తిప్పే అవకాశం
దినకరన్ మరోసారి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ కె నగర్ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో కన్పించే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అన్నాడిఎంకెపై ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications