Bengaluru: భార్య, పిల్లలకు విషం పెట్టి చంపేసిన భర్త, క్లైమాక్స్ లోబతికిపోయాడు. బావ !
బెంగళూరు/కోణెణకుంటే: అతను క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చాలా కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనికి వ్యాధినయం కాలేదు. తాను ఎక్కువ రోజులు బతకను అని అతనికి తెలిసిపోయింది. వైద్యులు మాట్లాడే మాటాలతో అతనికి ఇంకా భయం ఎక్కువ అయ్యింది. తాను చనిపోతే తన భార్య, పిలల్లను ఎవరు చూసుకుంటారు, సమాజంలో వారు చులకన అయిపోతారు అని భర్త భయపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలకు ఆహారంలో విషం పెట్టి చంపేసిన అతను ఆత్మహత్యాయత్నం చేశాడు.

భార్య, పిల్లలను చంపేశాడు
బెంగళూరు నరంలోని కోణెనకుంటలో నాగేంద్ర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి విజయా (28) అనే భార్య, నిషా (7), దీక్షా (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం రాత్రి భోజనంలో భార్య విజయాతో పాటు ఇద్దరు కుమార్తెలకు పెట్టాడు. విషం కలిపిన ఆహారం తిన్న విజయా, ఆమె ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. భార్య, పిల్లలను చనిపోయారు అని నిర్దారించుకున్న నాగేంత్ర మొదట కత్తితో చేతిని కోసుకుని తరువాత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

2014లో వివాహం
బెంగళూరులో నివాసం ఉంటున్న నాగేంద్ర 2014 లో విజయాను వివాహం చేసుకున్నాడు. నాగేంద్రకు మద్యం సేవించే అలవాటు విపరీతంగా ఉందని. ఇదే సమయంలో నాగేంద్రకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వ్యాధి సోకిన తరువాత నాగేంద్ర ఎలాంటి పని చెయ్యలేకపోయాడు. నాగేంద్రకు సోకిన వ్యాధితో అతని ఫ్యామిలీని దెబ్బ తీసింది. నాగేంద్ర తాగుడు, అతని క్యాన్సర్ వ్యాధి ప్రభావం రానురాను అతని ఫ్యామిలీ మీదపడటంతో లేనిపోని సమస్యలు ఎదురైనాయి.

ఫ్యామిలీని పోషిస్తున్న భార్య
క్యాన్సర్ వ్యాధితో నాగేంద్ర ఇంటికే పరిమితం అయ్యాడు. తరువాత పనికి వెలుతున్న విజయా ఆమె భర్త, ఇద్దరు కూతుర్లను పెంచిపోషిస్తున్నది. మొత్తం కుటుంబానికి బాధ్యత వహించిన విజయా మెడికల్ షాపులో పనిచేస్తోంది. కుటుంబానికి కొంచెం ఆర్థికంగా ఉంటున్న విజయా తల్లి బెంగళూరులోని వడ్డెరపాల్యలోని అద్దె ఇంటిలో నివసించింది, అక్కడ ఇల్లు ఉంది. విజయా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.

జస్ట్ బతికిపోయాడు
భార్య విజయాతో పాటు ఇద్దరు పిల్లలకు ఆహారంలో విషం పెట్టి చంపేసిన నాగేంద్ర తరువాత చేతులు కోసుకుని ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. కొంతసటికే విజయా సోదరుడు బాబు అదే సమయంలో అక్కడికి వెళ్లాడు. తరువాత చీరకు వేలాడున్నబాబ నాగేంద్రను చూసిన బాబు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇంటిలోనే తల్లీపిల్లలు హతకు గురికావడం బెంగళూరులో కకలం రేపింది.












Click it and Unblock the Notifications