Wife: కాలేజ్ లవర్స్, సినిమా స్టైల్లో సీక్రేట్ గా పెళ్లి, ఎవరి ఇంట్లో వాళ్లు ?, మార్కెట్ యార్డ్ పక్కన !
చెన్నై/వేలూరు: కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా ఉన్న యువతి, యువకుడు తరువాత ప్రేమించుకున్నారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత ప్రేమికులు బయట తిరుగుతూ ఎంజాయ్ చేశారు. కాలేజ్ చదువు పూర్తి కాకముందే ప్రేమికులు ఓ గుడిలో సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారు. సినిమా స్టైల్లో పెళ్లి విషయం ఇద్దరూ వారి కుటుంబ సభ్యుల దగ్గర సీక్రేట్ గా పెట్టారు. మన పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు చెప్పాలని భర్త అతని భార్య మీద ఒత్తిడి చేశాడు. అయితే పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు చెప్పకూడదని భార్య పట్టుబట్టింది. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే తనను మోసం చేస్తోందని ఆమె భర్త రగలిపోయాడు. మాట్లాడాలని పిలిపించిన భర్త అక్కడ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ప్రేమించి సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న భార్య మీద అనుమానంతో కత్తితో ఆమె గొంతు కోసేయడం కలకలం రేపింది.
కాలేజ్ కు వెలుతున్న యువతి
తమిళనాడులోని వేలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా) కుప్పట్టమోటూరులో యాషిని (20) అనే యువతి నివాసం ఉంటున్నది. వేలూరు క్రిష్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో యాషిని నర్సింగ్ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. వేలూరులోని ప్రైవేట్ కాలేజ్ లో సతీష్ కుమార్ (23) అనే యువకుడు చదువుతున్నాడు.
సీక్రేట్ గా గుడిలో పెళ్లి
కాలేజ్ లో చదువుతున్న సతీష్ కుమార్, యాషినికి పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా ఉన్న సతీష్ కుమార్, యాషిని తరువాత ప్రేమించుకున్నారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత ప్రేమికులు సతీష్ కుమార్, యాషిని బయట తిరుగుతూ ఎంజాయ్ చేశారు. కాలేజ్ చదువు పూర్తి కాకముందే ప్రేమికులు సతీష్ కుమార్, యాషిని నాలుగు నెలల క్రితం వేలూరు సమీపంలోని ఓ గుడిలో సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారు.
సినిమా స్టైల్లో సీక్రేట్ గా పెట్టేశారు
సినిమా స్టైల్లో పెళ్లి చేసుకున్న విషయం సతీష్ కుమార్, యాషిని వారి కుటుంబ సభ్యుల దగ్గర సీక్రేట్ గా పెట్టారు. ప్రేమికులు ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉంటున్నారు. మన పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు చెప్పాలని సతీష్ కుమార్ అతని భార్య యాషిని మీద ఒత్తిడి చేశాడు. అయితే పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు చెప్పకూడదని యాషిని పట్టుబట్టింది.
మార్కెట్ యార్డ్ పక్కన భార్య గొంతు కోసేశాడు
తన భార్య యాషిని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే తనను మోసం చేస్తోందని సతీష్ కుమార్ రగలిపోయాడు. మాట్లాడాలని యాషినిని మార్కెట్ యార్డ్ సమీపంలోకి పిలిపించిన సతీష్ కుమార్ అక్కడ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ప్రేమించి సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న భార్య యాషిని మీద దాడిచేసి కత్తితో ఆమె గొంతు కోసేసిన సతీష్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
భర్తను పట్టుకుని చితకబాదిన స్థానికులు
స్థానికులు వెంబడించి సతీష్ కుమార్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. గొంతు తెగిపోవడంతో యాషిని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు అన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యు పట్టపగలు అందరూ చూస్తున్న సమయంలో ఆమె గొంతు కోసి చంపడానికి భర్త ప్రయత్నించడం కలకలం రేపింది.