Wife: ఇంటికి వెళ్లిన భర్త అక్కడ ఏం చూశాడో ?, భార్యను స్పాట్ లో కొట్టి చంపేశాడు, చివరికి !
బెంగళూరు/ఉడిపి: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఎంత సంతోషంగా జీవితం గడపడం మొదలుపెట్టారో అంతే త్వరగా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. వేరుకాపురం పెడుదామని భార్య బలవంతం చేసింది. భార్య కోరిక మేరకు భర్త అద్దె ఇల్లు తీసుకుని అక్కడే కాపురం పెట్టాడు. అక్కడ కూడా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. .భర్త డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇంట్లో ఉంటున్న భార్య మీద ఇంకా ఎక్కువ అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతులు గొడవపడుతున్నారు. రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన భర్త అక్కడ సీన్ చూసి అతని భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. భార్య చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
దంపతులు సంతోషంగా ఉన్నారని అనుకున్నారు
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపురలో రవి ఆచార్య (43) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన పూర్ణిమా ఆచార్య అలియాస్ పూర్ణిమా (38) అనే మహిళను రవి ఆచార్య పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రవి ఆచార్య, పూర్ణిమా ఆచార్య దంపతులు చాలా సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు.
ఇల్లు మార్చినా సేమ్ సీన్ రిపీట్
రవి ఆచార్య, పూర్ణిమా ఆచార్య ఎంత సంతోషంగా జీవితం గడపడం మొదలుపెట్టారో అంతే త్వరగా ఆ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. వేరుకాపురం పెడుదామని పూర్ణిమా బలవంతం చేసింది. పూర్ణిమా ఒత్తిడి చెయ్యడంతో ఆమె కోరిక మేరకు కట్ బెల్తూరులో అద్దె ఇల్లు తీసుకున్న రవి ఆచార్య అక్కడ కాపురం పెట్టాడు. ఇల్లు మార్చినా రవి ఆచార్య, పూర్ణిమా దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
రాత్రి ఇంటికి వెళ్లి ఏం చూశాడో ?
రవి ఆచార్య డ్రైవర్ గా పని చేస్తుండటంతో అతను ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇంట్లో ఉంటున్న భార్య పూర్ణిమా మీద ఆమె భర్త రవి ఆచార్యకు ఇంకా ఎక్కువ అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో రవి ఆచార్య, పూర్ణిమా దంపతులు గొడవపడుతున్నాయి. ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన రవి ఆచార్య ఇంట్లో ఏం చూశాడో కాని రగిలిపోయాడు.
రాత్రి ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి
ఇంట్లో సీన్ చూసిన రవి ఆచార్య రగిలిపోయి అతని భార్య పూర్ణిమాను అతి దారుణంగా కొట్టి ఇంట్లోనే చంపేశాడు. భార్య పూర్ణిమా చనిపోయిందని నిర్దారించుకున్న తరువాత రవి ఆచార్య విషం సేవించి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం దంపతులు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగు చూసిందని పోలీసులు అన్నారు. పూర్ణిమా హత్యకు గురి కావడం, రవి ఆచార్య ఆత్మహత్య చేసుకోవడంతో అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదని వాళ్ల బంధువులు అంటున్నారు.