Wife: ప్రియుడితో భార్య రొమాన్స్, గొడ్డలితో తల నరికేసి, ముక్కలు చేసి అడవిలో వేసిరేసి !
బోపాల్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్త ఇంటిలో ఉంటున్నది. భర్తతో కలిసి ఉంటున్న మహిళ కనపడటం లేదని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కనపడకుండా పోయిన మహిళ కోసం గాలిస్తున్నారు. అటవి ప్రాంతంలో మహిళ శవం రెండు ముక్కలుగా అయిన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. కొన్ని రోజుల క్రితం కనపడకుండా పోయిన మహిళ దుస్తులు అదే అటవి ప్రాంతంలో కనిపించాయి. మహిళను ఆమె భర్త ముక్కలుగా నరికేశాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
Girls: కాలేజ్ లో అమ్మాయిల బాత్ రూమ్ ల్లో సీక్రేట్ కెమెరాలు, 1,200 వీడియోలు తీసి ?, ఇంకో ఫోన్ లో !
దంపతుల నివాసం
మధ్యప్రదేశ్ లోని షాదోల్ ప్రాంతంలో రామ్ కిశోర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు కుదిర్చిన సరస్వతి పటేల్ అలియాస్ సరస్వతి అనే మహిళను రామ్ కిశోర్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాలు రామ్ కిశోర్, సరస్వతి దంపతులు సంతోషంగా జీవించారు.
సోదరి మాయం అయ్యిందని కేసు పెట్టిన సోదరుడు
కొన్ని రోజుల నుంచి సరస్వతి నుంచి ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్స్ రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. ఈనెల 13వ తేదీన తన సోదరి సరస్వతి కనపడటం లేదని ఆమె సోదరుడు షాదోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సరస్వతి కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలించారు.
అటవి ప్రాంతంలో రెండు ముక్కలైన భార్య
షాదోల్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలోని అటవి ప్రాంతంలో ఓ మహిళను నరికి చంపేసి రెండు ముక్కలుగా చేశారని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్నీఫర్ డాగ్స్ తో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. మహిళ హత్యకు గురైన ప్రాంతంకు చాలా దూరంలో ఆమె దుస్తులు కనిపించాయి.
భర్తకు బెండ్ తీశారు
అటవి ప్రాంతంలో హత్యకు గురైన మహిళ షాదోల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సరస్వతి అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సరస్వతి కుటుంబ సభ్యులు ఆమె శవాన్ని గుర్తుపట్టారు. సరస్వతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో ఆమె భర్త రామ్ కిశోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతనికి బెండ్ తీసి విచారణ చేశారు.
అక్రమ సంబంధం ఉందని తల నరికి చంపేశాను
తన భార్య సరస్వతికి వేరే యువకుడితో అక్రమ సంబంధం ఉందని, పద్దతి మార్చుకోవాలని, అతన్ని కలవకూడదని తాను ఎంత చెప్పినా ఆమె పద్దతి మార్చుకోలేదని, అందుకే గొడ్డలతితో తల, మొండెం నరికి హత్య చేసి ఆమె శవాన్ని అటవి ప్రాంతంలోకి తీసుకు వచ్చి విసిరేశానని రామ్ కిశోర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.