Wife: గోవాలో పబ్, క్యాసినో వ్యాపారం చేస్తున్న భర్త, ప్రియురాలితో ?, భార్యకు మ్యాటర్ తెలిసి, ఉతికేశాడు !
బెంగళూరు/హుబ్బళి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. సొంతఊర్లో భార్య ఉంటున్నది. గోవాకు వెళ్లిన భర్త అక్కడ పబ్ లు, క్యాసినో వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వెలుతున్న భర్త అతని భార్యతో ఏదో అలా కాపురం చేసి మళ్లీ గోవాకు చెక్కేస్తున్నాడు. తన భర్త ఎందుకు తనతో ఇంటికి వచ్చినా దూరంగా ఉంటున్నాడని, ముందులాగా సంతోషంగా ఉండటం లేదని భార్యను అనుమానం పెరిగింది. దంపతులు నివాసం ఉంటున్న సిటీలోనే ఓ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ లేడీ దగ్గరకు భర్త ఎక్కువగా వెళ్లి వస్తున్నాడని అతని భార్యకు తెలిసిపోయింది. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను అతని భార్య నిలదీసింది. ఆ దెబ్బతో తన భర్త తనకు చిత్రహింసలు పెడుతున్నాడని అతని భార్య ఆరోపిస్తున్నది. తన భర్త, అతని బంధువులు, నా మొగుడి ప్రియురాలు కలిసి తన మీద దాడి చేశారని, ఆస్తులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తనను సంతకాలు చెయ్యాలని తన మీద దాడి చేస్తున్నారని, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసు కేసు పెట్టిన భార్య ప్రెస్ మీట్ పెట్టి వ్యాపారవేత్త మీద ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

సంతోషంగా ఉంటున్న దంపతులు
కర్ణాటకలోని హుబ్బళిలో గిరీష్ గదిగప్ప అలియాస్ గిరీష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం గిరీష్ హుబ్బళికి చెందిన జయలక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. గిరీష్, జయలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. హుబ్బళిలో భార్య జయలక్ష్మి ఉంటున్నది.

గోవాలో పబ్ లు, క్యాసినో వ్యాపారం చేస్తున్న భర్త
గోవాకు వెళ్లిన జయలక్ష్మి భర్త గిరీష్ అక్కడ పబ్ లు, క్యాసినో వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వెలుతున్న గిరీష్ అతని భార్య జయలక్ష్మితో ఏదో అలాఅలా కాపురం చేసి మళ్లీ గోవాకు చెక్కేస్తున్నాడని అతని భార్య ఆరోపిస్తున్నది. తన భర్త గిరీష్ ఎందుకు మారిపోయాడు అంటూ జయలక్ష్మి ఆరా తీసింది.

భర్తకు ప్రియురాలు ఉందని తెలుసుకున్న భార్య ?
తన భర్త గిరీష్ ఎందుకు తనతో ఇంటికి వచ్చినా దూరంగా ఉంటున్నాడని, ముందులాగా సంతోషంగా ఉండటం లేదని అతని భార్య జయలక్ష్మికి రానురాను అనుమానం పెరిగింది. గిరీష్, జయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్న హుబళి సిటీలోనే ఓ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ లేడీ దగ్గరకు తన భర్త ఎక్కువగా వెళ్లి వస్తున్నాడని అతని భార్య జయలక్ష్మికి తెలిసిపోయింది.

నా భర్తకు అక్రమ సంబంధం ఉంది
కిలాడీ లేడీ మైత్రాయిణి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త గిరీష్ ను అతని భార్య జయలక్ష్మి నిలదీసింది. ఆ దెబ్బతో తన భర్త గిరీష్ తనకు చిత్రహింసలు పెడుతున్నాడని అతని భార్య జయలక్ష్మి ఆరోపిస్తున్నది. రోజూ ఏదో ఒక విషయం అడ్డం పెట్టుకుని తన భర్త గిరీష్ తనను టార్చర్ పెడుతున్నాని జయలక్ష్మి ఆరోపిస్తున్నది.

చంపేస్తామని బెదిరిస్తున్నారు
తన భర్త గిరీష్, అతని బంధువులు నీలకంఠ, హర్షవర్దన్, నా మొగుడి ప్రియురాలు మైత్రాయిణి కలిసి తన మీద దాడి చేశారని, ఆస్తులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తనను ఖాలీ పేపర్ల మీద సంతకాలు చెయ్యాలని తన మీద దాడి చేస్తున్నారని, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ జయలక్ష్మి పోలీసు కేసు పెట్టింది. ఇదే విషయాన్ని హుబ్ళిలో ప్రెస్ మీట్ పెట్టిన జయలక్ష్మి ఆమె, వ్యాపారవేత్త గిరీష్ మీద, అతని బంధువుల మీద ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications