అన్నం పెట్టకుండా సెల్ పోన్ మాట్లాడుతున్న భార్యను చంపిన భర్త
పాట్నా :టెక్నాలజీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడ ఉన్నాయి. సెల్ ఫోన్లు మానవ సంబందాలను దెబ్బతీస్తున్న ఘటనలను చూస్తున్నాం.ఇలాంటి ఘటనే మరోకటి బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.బోజనం పెట్టాలని అడిగిన భర్తకు బోజనం పెట్టకుండా ఆలస్యం చేసినందుకు ఆగ్రహాంచి శుక్రవారం నాడు ఆమెను హత్యచేశాడు.
శివమంగళ్ రామ్ అనే వ్యక్తి ఆయన భార్య దుర్గాదేవిని చంపిన ఘటన సంచలనం సృష్టించింది. శివమంగళ్ రామ్ అనే వ్యక్తి భోజనం పెట్టాలని భార్యను అడిగాడు ఆమె భోజనం పెట్టకుండా ఫోన్ మాట్లాడుతూ ఆలస్యం చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన శివమంగళ్ రామ్ ఆమెను హాత్యచేశాడు.
దుర్గాదేవిపై ఆమె భర్త దాడి చేసే సమయంలో బందువులు అడ్డుకోబోయారు.వారిలో ఒకరిని శివమంగళ్ రామ్ గాయపర్చాడు.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.దుర్గాదేవిని రక్షించే క్రమంలో గాయపడిన ఆమె బందువును స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మద్యం మత్తులోనే శివమంగళ్ రామ్ ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.