Wife: భార్య మీద అనుమానం, బయటకు వెలితే ఏం చేస్తుందో ? కత్తితో పొడిచి, బండరాళ్లతో ఛట్నీ చేశాడు !
థానే/ కల్యాణ్/ చెన్నై: భార్యతో చక్కగా కాపురం చేసుకుంటున్న జీవిస్తున్న భర్త తాను బయటకు వెలితే ఆమె ఏం చేస్తుందో అంటూ రానురాను ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. పదేపదే భార్యతో గొడవపడుతున్న భర్త ఆమెను చితకబాదడం మొదలు పెట్టాడు. ఫస్ట్ పార్ట్ లో భార్యను చితకబాదిన భర్త తారువాత సెకండ్ పార్టులో ఆమెకు టార్చర్ పెట్టాడు. భర్త టార్చర్ తట్టుకోలేక ఎదురు తిరిగిన భార్య నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అని తేల్చి చెప్పింది. తన భార్య తనకే ఎదురు తిరిగుతోందని రెచ్చిపోయిన భర్త ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. మంచి టైమ్ కోసం ఎదురు చూసిన భర్త అతని భార్యను కత్తితో పొడిచి చంపేసి ముఖం మీద బండరాళ్లతో చితకబాది ఛట్నీ చేసి చంపేశాడు. తన మీద కేసు రాకుండా భర్త జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే భర్తే అతని భార్యను హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

సంతోషంగా సంసారం చేసిన భర్త
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని భివండి సమీపంలోని సవాద్ ప్రాంతంలో జనార్దన్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం లక్ష్మీ మోహిత్ (25) అనే యువతిని వివాహం చేసుకుకోవాలని జనార్దన్ కు అతని కుటుంబ సభ్యులు చెప్పారు. పెద్దలు చెప్పినట్లు లక్ష్మీ మోహిత్ ను వివాహం చేసుకున్న జనార్దన్ ఆమెతో చక్కగా కాపురం చేసుకుంటూ వచ్చాడు.

భార్య మీద అనుమానం
భార్య లక్ష్మితో కలిసి థానే సమీపంలోని కల్యాణ్ ఏరియాలో కాపురం పెట్టిన జనార్దన్ ఉదయం నిద్రలేచి ఇంట్లో టిఫిన్ తిని తరువాత అతని పని అతను చేసుకోవడానికి బయటకు వెళ్లిపోతున్నాడు. భర్త జనార్దన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత అతని భార్య లక్ష్మీ మోహిత్ ఇంట్లోనే ఉంటున్నది. రాత్రి ఇంటికి వెలుతున్న జనార్దన్ కొంతకాలం అతని భార్య లక్ష్మీ మోహిత్ తో సంతోషంగా గడిపాడు. అయితే రానురాను భార్య లక్ష్మీ మీద ఆమె భర్త జనార్దన్ కు అనుమానం మొదలైయ్యిందని సమాచారం.

పెద్దలు పంచాయితీలు
రానురాను భార్య లక్ష్మీ మోహిత్ ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్న జనార్దన్ అమెతో గొడవ పెట్టుకుని వేధింపులకు గురి చేశారు. భర్త జనార్దన్ టార్చర్ ఎక్కువ కావడంతో లక్ష్మీ మోహిత్ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. పెద్దలు పంచాయితీలు చెయ్యడంతో కొంతకాలం జనార్దన్ సైలెంట్ గా ఉన్నాడు. మళ్లీ జనార్దన్ కథ మొదలు కావడంతో లక్ష్మీ విసిగిపోయిందని తెలిసింది.

భార్యకు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ సినిమా చూపించిన భర్త
పదేపదే భార్య లక్ష్మీ మోహిత్తో గొడవపడుతున్న ఆమె భర్త జనార్దన్ ఆమెను చితకబాదడం మొదలు పెట్టాడు. ఫస్ట్ పార్ట్ లో భార్య లక్ష్మీని చితకబాదిన జనార్దన్ తారువాత సెకండ్ పార్టులో ఆమెకు టార్చర్ పెట్టాడు. భర్త అరచకాలు సహిస్తూ వచ్చిన లక్ష్మీ తరువాత అతని తీరుతో విరక్తి పెంచుకుందని సమాచారం.

భార్యను చంపేసిన భర్త
భర్త జనార్దన్ టార్చర్ తట్టుకోలేక ఎదురు తిరిగిన భార్య లక్ష్మి మోహిత్ నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అని తేల్చి చెప్పింది. తన భార్య లక్ష్మీ మోహిత్ తనకే ఎదురు తిరిగుతోందని రెచ్చిపోయిన జనార్దన్ ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. మంచి టైమ్ కోసం ఎదురు చూసిన జనార్దన్ సోమవారం రాత్రి అతని భార్య లక్ష్మీని బండరాళ్లో చితకబాది కత్తితో పదేపదే పొడిచి దారుణంగా చంపేశాడు.

కేసు నుంచి తప్పించుకోవాలని భర్త స్కెచ్
తన మీద కేసు రాకుండా జనార్దన్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. భార్య లక్ష్మిని చంపేసిన జనార్దన్ అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎస్కేప్ అయ్యాడు. లక్ష్మీని ఆమె భర్త జనార్దన్ హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. లక్ష్మీ శవాన్ని రుక్మిణి బాయి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీని దారుణంగా హత్య చేసి ఎస్కేప్ అయిన జనార్దన్ కోసం ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అశోక్ పవార్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications