మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
షిమ్లా : లోక్సభ ఎన్నికల వేళ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల కేసులు నమోదవుతుంటే.. మరికొన్ని చోట్ల కేంద్ర ఎన్నికల సంఘం మొట్టికాయలు వేస్తోంది. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. కొందరైతే ఈసీ నిషేధం విధించినా.. తమ నోటికి మాత్రం తాళం వేయలేకపోతున్నారు. ఆ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ సత్పాల్ సింగ్ సట్టి మరో వివాదంలో చిక్కుకున్నారు.
మూడోదశ ఎన్నికలు ముగిసి ఫోర్త్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సత్పాల్ సింగ్ సట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "ప్రధాని నరేంద్ర మోడీ వైపు ఎవరైనా వేలు చూపిస్తే.. భుజాలు నరికేస్తామంటూ" వివాదస్పదంగా మాట్లాడటం చర్చానీయాంశమైంది.

ఈ నెల 13వ తేదీన ప్రచార సభలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సత్పాల్ సింగ్.. కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. ఆయనపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. అంతేకాదు స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే నిషేధం ముగిసి మళ్లీ ప్రచారంలో పాల్గొన్న ఆయన మళ్లీ నోరు జారడం విస్మయం కలిగిస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications