దేశానికి నూతన ప్రధానిని అందిస్తాం..! లక్నోలో అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన..!!
లక్నో/హైదరాబాద్ : దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నామినేషన్లు, ఆరోపణలు. ప్రత్యారోపణలతో దేశం ఎన్నికల వేడిని రగుల్చుతోంది. లోక్సభ ఎన్నికల అనంతరం ఎస్పీ-బీఎస్పీ కూటమి దేశానికి తదుపరి ప్రధానిని అందిస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చెప్పారు. బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు తాము బీఎస్పీతో జట్టుకట్టామని వెల్లడించారు. యూపీలోని కన్నౌజ్లో గురువారం జరిగిన ప్రచార ర్యాలీలో బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. కాగా ఇదే వేదికపై నుంచి మాయావతి ప్రసంగించేందుకు ముందు అఖిలేష్ భార్య, కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న డింపుల్ యాదవ్ మాయావతి పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.

కాగా ఏప్రిల్ 29న సహరన్పూర్, ఖేరి, హర్దోయ్, మిశ్రిఖ్, ఉన్నావ్, ఫరక్కాబాద్, ఇటావా, కాన్పూర్, అక్బర్పూర్, జలన్, ఝాన్సీ, హమీర్పూర్ స్ధానాలతో పాటు కన్నౌజ్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కీలకమైన యూపీలో అత్యధిక స్ధానాలను కైవసం చేసుకునేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమి, బీజేపీలు పోటీపడుతుండగా, ప్రియాంక ప్రచారంతో తమ విజయావకాశాలు మెరుగయ్యాయని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఓ పక్క ప్రధాని మోదీ నామినేషన్ వేస్తున్న తరుణంలో అఖిలేష్ యాదవ్ ప్రకటనలు మరింత సంచలనం రేపుతున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications