ఫోర్త్ వేవ్ వస్తుందా? పెరుగుతున్నకరోనా కేసులతో ఇండియాలో కొత్త ఆందోళన; బీ అలెర్ట్!!
భారతదేశంలో కరోనా కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 2,067 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య 65 శాతం పెరిగింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,340గా ఉంది. గత 24 గంటల్లో నమోదైన మరణాల సంఖ్య 40కి చేరుకుంది. వీటిలో కేరళ జోడించిన 32 సవరించిన మరణాలు కూడా ఉన్నాయి. ఇక తాజా లెక్కలు ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న టెన్షన్ కు కారణంగా మారాయి.

రోజువారీ సానుకూలత రేటు నేడు 0.49 శాతం
రోజువారీ సానుకూలత రేటు నేడు 0.49 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.38 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,547 మంది కోవిడ్ రోగులు వ్యాధి నుండి కోలుకున్నారు. దేశంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం రికవరీల సంఖ్య 4,25,13,248కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా అందించబడిన సంచిత కోవిడ్ వ్యాక్సిన్ మోతాదు 186.90 కోట్లకు చేరుకుంది.

కరోనా కేసుల, మరణాల డేటా విషయంలో కేరళ ప్రభుత్వానికి కేంద్రం లేఖ
కోవిడ్-19 క్రియాశీల కేసులు 0.03% గా ఉంది. కోవిడ్ రికవరీ రేటు ప్రస్తుతం 98.76% గా నమోదైంది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షలు 83.29 కోట్లు కాగా గత 24 గంటల్లో 4,21,183 పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ప్రతిరోజూ కోవిడ్ డేటాను అందించాలని కోరుతూ కేంద్రం నిన్న కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది . 5 రోజుల విరామం తర్వాత కేరళ ఈ డేటాను నివేదించడం కేసుల సంఖ్య మరియు పాజిటివిటీ రేటు వంటి ప్రధాన కోవిడ్ సూచికలను ప్రభావితం చేసిందని మరియు వక్రీకరించిందని పేర్కొంది.

ఢిల్లీలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల పెరుగుదల
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ నగరంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి వరకు 632 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక వరుసగా పెరుగుతున్న కరోనా కేసులతో ఢిల్లీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలను చేపడుతుంది.

ఈ రాష్ట్రాలలో పెరుగుతున్న కేసులు .. అలెర్ట్ అంటున్న కేంద్రం
ప్రస్తుతం రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరం వంటి రాష్ట్రాలు కరోనా మహమ్మారి కట్టడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మంగళవారం కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు గా వెల్లడించింది. ఢిల్లీలో తాజాగా 632 కేసులు,కేరళలో 488 కేసులు నమోదైనట్లు గా సమాచారం. ఏది ఏమైనా మళ్ళీ కరోనా ప్రోటోకాల్స్ విషయంలో ప్రభుత్వాలు అలెర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని అర్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications