వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రూ. 500, 1000 నోట్లు చిత్తు కాగితాలే: ఏం చేయాలి?
న్యూఢిల్లీ: ఈ అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ కింది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ నుంచి నకిలీ ఐదు వందలు, వేయి రూపాయల నోట్లు దేశంలోకి రవాణా అయి చెలామణి అవుతున్న సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేశారు.
ఈ స్థితిలో మనం ఏం చేయాలనే విషయాలను ఈ కింద ఇవ్వడం జరిగింది. రూ.500, 1000 నోట్లను ఈ కింది రకంగా మనం చేయాల్సి ఉంటుంది.
- ఈ అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1,000 నోట్ల చెలామణిని రద్దు చేస్తారు
- రూ.500, రూ.1,000 నోట్లను నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 30 వరకు పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో జమ చేయాలి
- రిజర్వ్ బ్యాంక్ కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ప్రవేశపెడుతుంది.
- గడువు లోగా ఆ నోట్లను బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో జమ చేయలేనివారు రిజర్వ్ బ్యాంక్లో డిక్లరేషన్ ఇచ్చి సమర్పించవచ్చు.
- వచ్చే 72 గంటల పాటు ఆస్పత్రులు, విమానాశ్రయాలు, పెట్రోల్ బంకుల్లో రూ.500, రూ.1,000 నోట్లు చెల్లే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- నవంబర్ 9వ తేదీన అన్ని బ్యాంకులను మూసేస్తారు
- రూ.500, రూ.2,000 నోట్ల జారీకి రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రతిపాదనలకు అంగీకారం
Comments
English summary
In the wake of Prime Minister Narendra Modi announcing that the Rs 500 and Rs 1,000 notes will not be valid from midnight today, here are the steps one needs to take.
Story first published: Tuesday, November 8, 2016, 22:00 [IST]