Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ. 500, 1000 నోట్లు చిత్తు కాగితాలే: ఏం చేయాలి?

న్యూఢిల్లీ: ఈ అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు చెల్లవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ కింది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ నుంచి నకిలీ ఐదు వందలు, వేయి రూపాయల నోట్లు దేశంలోకి రవాణా అయి చెలామణి అవుతున్న సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేశారు.

ఈ స్థితిలో మనం ఏం చేయాలనే విషయాలను ఈ కింద ఇవ్వడం జరిగింది. రూ.500, 1000 నోట్లను ఈ కింది రకంగా మనం చేయాల్సి ఉంటుంది.

Thousand notes
  • ఈ అర్థరాత్రి నుంచి రూ.500, రూ.1,000 నోట్ల చెలామణిని రద్దు చేస్తారు
  • రూ.500, రూ.1,000 నోట్లను నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 30 వరకు పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో జమ చేయాలి
  • రిజర్వ్ బ్యాంక్ కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ప్రవేశపెడుతుంది.
  • గడువు లోగా ఆ నోట్లను బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో జమ చేయలేనివారు రిజర్వ్ బ్యాంక్‌లో డిక్లరేషన్ ఇచ్చి సమర్పించవచ్చు.
  • వచ్చే 72 గంటల పాటు ఆస్పత్రులు, విమానాశ్రయాలు, పెట్రోల్ బంకుల్లో రూ.500, రూ.1,000 నోట్లు చెల్లే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
  • నవంబర్ 9వ తేదీన అన్ని బ్యాంకులను మూసేస్తారు
  • రూ.500, రూ.2,000 నోట్ల జారీకి రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రతిపాదనలకు అంగీకారం
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+