కారు దొంగతనం: కేజ్రీవాల్కు ఢిల్లీ పోలీసుల ధీటైన సమాధానం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. ఆ తర్వాత ఎట్టకేలకు దానిని పోలీసులు గుర్తించారు. అయితే దీనిపై కేజ్రీవాల్ చేసిన విమర్శపై ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పారు.ఢిల్లీలో భద్రత సరిగ
Recommended Video
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. ఆ తర్వాత ఎట్టకేలకు దానిని పోలీసులు గుర్తించారు. అయితే దీనిపై కేజ్రీవాల్ చేసిన విమర్శపై ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పారు.
ఢిల్లీలో భద్రత సరిగా లేదని కేజ్రీవాల్ అన్నారు. దీనిపై పోలీసులు మాట్లాడారు. అపహరణకు గురైన కారు ఢిల్లీ సెక్రటేరియట్ పార్కింగ్ ప్రదేశానికి 200 మీటర్ల దూరంలోనే ఉందని అన్నారు.
కారును దొంగిలించడానికి వీల్లేకుండా ఉండే స్టీరింగ్ లాక్, గేర్ లాక్ వ్యవస్థలు లేవని తెలిపారు. ఇలా ఉంటే కారును దొంగిలించడం చాలా సులభమవుతుందని పోలీస్ ప్రతినిధి మధూర్ వర్మ వివరించారు.
ప్రజలందరూ పార్కింగ్ ప్రదేశాల్లోనే తమ వాహనాలను నిలుపుతున్నారని, చోరీకి గురవుతున్న వాహనాల్లో అధికశాతం పార్కింగ్ స్థలంలో ఉండటం లేదన్నారు.
అపహరణకు గురైన నీలిరంగు వాగనోర్ కారు సీఎం కేజ్రీవాల్ సొంతది కాదని, ఆయన ఉపయోగించడం లేదని, ఆ కారు ఏఏపీ మీద ఆ కారు రిజిస్టరైందని, దాన్ని ఆ పార్టీ నేత వందన సింగ్ ఉపయోగిస్తున్నారన్నారు.