వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిల్లా కలెక్టరేట్‌లో మహిళపై ఐదుగురు గ్యాంగ్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

ముజఫర్‌పూర్ (బీహార్): బీహార్ రాష్ట్రంలో మహిళపై దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘాతుకానికి పాల్పడినవారిలో సీనియర్ పాలనాధికారి డ్రైవర్ కూడా ఉన్నాడు. బీహార్‌లో ముజఫర్‌పూర్ కలెక్టర్ కార్యాలయంలో ఆ సంఘటన జరిగినట్లు పోలీసు అధికారులు సోమవారం వెల్లడించారు.

సీతారాంపూర్ జిల్లాలోని బావగారి ఇంట్లో దింపుతామని మహిళకు నచ్చజెప్పి 30 ఏళ్ల మహిళను అదనపు జిల్లా మెజిస్టేట్ డ్రైవర్‌తో ఐదుగురు వ్యక్తులు వాహనం ఎక్కించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారని సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ రంజీత్ కుమార్ మిశ్రా చెప్పారు.

Woman allegedly gangraped at district collectorate in Bihar

మహిళ వారి బంధనాల నుంచి ఎలాగో తప్పించుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి సాయం కోరిందని ఆయన చెప్పారు ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను జిల్లా అదనపు మెజిస్ట్రేట్ డ్రైవర్ నికు పండిట్, జితేంద్ర పాశ్వాన్, వికాస్ తివారీ, గౌతం ఝా, దీపక్ కుమార్‌లుగా గుర్తించినట్లు మిశ్రా చెప్పారు

పండిట్‌ను అరెస్టు చేసినట్లు, మిగతా వారిని పట్టుకోవడానికి దాడులు నిర్వహిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం మహిళను శ్రీకృష్ణా వైద్య కళాశాల, ఆస్పత్రికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు.

English summary
A woman from West Bengal was gangraped by five men, including a driver of a senior administrative official, in district collectorate premises in Bihar's Muzaffarpur district, a police officer said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X