ఫేస్బుక్ పరిచయం: మహిళతో సహజీవనం చేసి వదిలేశాడు
జైపూర్: ఫేస్బుక్లో పరిచయమైన మహళను.. వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాస్థాన్ రాష్ట్రంలోని జైపూర్కు చెందిన విడాకులు తీసుకున్న ఓ మహిళ (28)కు జార్ఖండ్కు చెందిన రంజన్పాండే ఫేస్బుక్లో పరిచయమయ్యాడు.
వివాహం చేసుకుంటానని సహజీవనం చేసి ముఖం చాటేశాడు. దీంతో సదరు మహిళ శ్యామ్నగర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంజన్ ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు.
రంజన్కు 25-30ఏళ్లు ఉంటాయని, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అతడు పంజాబ్లోని ముఖత్సర్లో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ మూడేళ్ల క్రితం బాధితురాలితో అతనికి పరిచయం ఏర్పడిందని చెప్పారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రంజన్.. బాధితురాలితో కొంతకాలంపాటు సహజీవనం చేశాడని తెలిపారు. ఆ తర్వాత వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అతడు పరారయ్యాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు శ్యామ్నగర్ ఎస్హెచ్ఓ కెఆర్ చౌదరి తెలిపారు.