కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం, మరో మహిళపై ఆరుగురు
లూధియానా: పంజాబ్లోని లూధియానాలో కదులుతున్న కారులో 23 ఏళ్ల యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లూధియానాలోని రాజ్ గురు నగర్ ప్రాంతంలో ఆ యువతి బంధువుల ఇంట్లో ఉండి, ఉద్యోగం చేసుకుంటోంది.
శనివారం రాత్రి ఆమె సమీపంలో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వెళ్లి వస్తుండగా, కారులో కొందరు దుండగలు వచ్చి ఆమెను ఎత్తుకుపోయారు. ఆనంతరం వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, తిరిగి అదే ప్రాంతంలో వదిలివెళ్లారని పోలీసులు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని వారిలో ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపిందన్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవి దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఇది ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని పీలీభీత్లో 32ఏళ్ల బధిర మహిళపై ఆరుగురికి పైగా వ్యక్తులు అత్యాచారం చేశారు. పురాణ్ పూర్లో ఉంటే ఆ మహిళను, శనివారం ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో దుండగులు వచ్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారాని పాల్పడ్డారు.