వివాహేతర సంబంధం: కానిస్టేబుల్ భర్తను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన భార్య
గాంధీనగర్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ పోలీసు కానిస్టేబుల్ను ఆయన భార్య క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన సంఘటన గుజరాత్లోని కేవడియ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
ముఖేష్ ఎస్ బారియా స్ధానిక సర్దార్ సరోవర్ రిజర్వాయర్ వద్ద పోలీసు కానిస్టేబుల్గా విధులు నిర్వహించేవాడు. ఆయన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత ప్రతిరోజూ అతనితో గొడవ పడుతుండేదని ఇన్ స్పెక్టర్ వైపీ పటేల్ శనివారం అన్నారు.

ఈ విషయమై నాలుగు రోజుల క్రితం కూడా భార్యభర్తలు గొడవపడ్డారు. ఈ సమయంలో కోపంలో క్రికెట్ బ్యాట్తో తన భర్తపై విచక్షణా రహితంగా దాడి చేసింది. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్కు చేరుకొని తన భర్త అపస్మారక స్ధితిలో పడి ఉన్నాడని పోలీసులకు తెలిపింది.
హుటాహుటిని ఇంటికి చేరుకున్న వారు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications