గెస్ట్ హౌస్‌లో లేడీ కానిస్టేబుల్ మృతి: ప్రియుడి అరెస్టు

Woman constable found dead in Delhi guest house; fiance arrested
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అతిథి గృహంలో సోమవారం ఉదయం 23 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ప్రియాంక కుమారి శవమై తేలింది. ఈ మృతికి సంబంధించి పోలీసులు ఆమె ప్రియుడు, మాజీ నేవీ అధికారి మోహిత్ శర్మను అరెస్టు చేశారు. ఆమె మరణించినప్పటి నుంచి మోహిత్ పరారీలో ఉన్నాడు. అయితే, మోహిత్‌ను అతని గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం - ఢిల్లీలోని సాగర్ పూర్ ప్రాంతంలో గల నీల్ గగన్ అతిథి గృహంలో ఆదివారంనాడు మోహిత్ గదిని బుక్ చేశాడు. ప్రియాంక తన భార్య అని అతను మేనేజర్‌కు చెప్పాడు. సాయంత్రం అతిథి గృహం నుంచి వెళ్లిపోతూ మోహిత్ శర్మ కనిపించాడు.

మర్నాడు అతిథి గృహం మేనేజర్ గదికి కాల్ చేస్తే జవాబు రాలేదు. దాంతో సిబ్బంది బలవంతంగా తలుపులు తెరిచారు. ప్రియాంక శవం గదిలో పడకపై వారి కంటపడింది. ప్రియాంక, మోహిత్‌లకు నిరుడు నిశ్చితార్థం జరిగింది. మోహిత్ మద్యానికి బానిస అని, ప్రవర్తన సరిగా ఉండదనే కారణాలతో ప్రియాంక కుటుంబం పెళ్లిని రద్దు చేసుకోవాలని అనుకుంది.

మోహిత్ శర్మ ప్రియాంకతో టచ్‌లో ఉన్నాడు. పెళ్లి రద్దు చేసుకుంటున్నారనే విషయం అతనికి మెల్లగా తెలిసింది. దీంతో ప్రియాంకను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+