కట్నం కోసం మహిళా పోలీసునే హతమార్చారు
ముజఫర్నగర్: దేశంలో ఇంకా వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కట్నం కోసం ఓ మహిళా పోలీసునే భర్త, అత్తమామలు కలిసి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్లోని ఖటౌలి ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ రేణుకి ఓ కంప్యూటర్ ఇంజినీరుతో ఏడాది క్రితం వివాహమైంది. కట్నం కోసం వేధింపులకు గురిచేసి, భర్త, అత్తమామలు ఆమెను కొట్టి తీవ్రంగా గాయపర్చారు.
బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చిన అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications