వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేయి నుంచి జారిన రూ.2వేల నోటు కోసం రైలు వస్తుండగా ట్రాక్ పైకి దూకిన యువతి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఇరవై ఆరేళ్ల ఓ యువతి రూ.2వేల నోటు కోసం రైలు ట్రాక్ పైకి దూకింది. ఆమె ట్రాక్ పైకి దూకే సమయానికి రైలు వస్తోంది. కానీ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ సంఘట ఢిల్లీలోని ద్వారక మోర్ మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. ఆమె రైలు వస్తుంటే చూసుకోకుంటా.. రూ.2వేల నోటు కోసం దూకింది.

<strong>మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?</strong>మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?

ఆ యువతి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చింది. అయితే ఆ సమయంలో తన దగ్గరున్న రూ.2వేల నోటు చేజారి ట్రాక్ పైన పడిపోయింది. ఓ పక్క రైలు వస్తుండగా, మరోవైపు ఆమె ట్రాక్ పైకి దూకింది. ఆమె బయటకు వచ్చేలోపు రైలు వచ్చింది.

Woman jumps on Delhi metro track to grab Rs 2,000 note, goes under train: unhurt

ప్లాట్ ఫాం వద్ద ట్రాక్‌ పక్కన ఉన్న కొంచెం ఖాళీలో రైలు వెళ్లేంత వరకు ఆమె వేచి చూడాలని భావించింది. కానీ లోకో పైలట్ ఆమెను గమనించాడు. దీంతో రైలును ఆపేశాడు. ఆమె చిన్న ఖాళీలో మాత్రమే ఉంది. లోకో పైలట్ రైలును ఆపాడు. ఆ రైలులోని రెండు కోచ్‌లు ఆమెను దాటుకొని వెళ్లాయి. ఆ తర్వాత ఆమెను పైకి తీసుకు వచ్చారు. సీఐఎస్ఎ‌ఫ్‌ సేవలకు భంగం వాటిల్లినందుకు వారికి ఆమె రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపింది.

దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ... ఆమె ట్రాక్ పక్కన గల ఖాళీలో నిలబడ్డారని, మెట్రో రైలుకు చెందిన రెండు కోచ్‌లు ఆమెను దాటుకొని వెళ్లాయని, అనంతరం రైలు ఆగిందని, అఫ్పుడు ఆమె భద్రంగా బయటకు వచ్చిందని చెప్పారు.

English summary
A 26 year old woman jumped on the tracks to pick up a Rs 2,000 note and narrowly escaped death despite going under a Metro train on Tuesday morning at Dwarka Mor Metro station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X