స్త్రీని చంపేసి 13 ముక్కలు చేసి బ్యాగుల్లో కుక్కారు
ముంబై సమీపంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను చంపేసి ఆమె శవాన్ని 13 ముక్కలు చేసి మూడు సంచుల్లో శరీరభాగాలను కుక్కారు.
ముంబై: ముంబై సమీపంలోని పాన్వెల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళను చంపేసి, ఆమె శరీరాన్ని 13 ముక్కలు చేసి వాటిని మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కి పడేశారు. గుర్తు పట్టలేని రీతిలో శవం పాడైపోయింది.
చేతులను, కాళ్లను ,తలను నరికేశారు. వాటిని పశ్చిమ పాన్వెల్లోని ఖందా కాలనీ గ్యారేజీలో పారేశారు. గ్యారేజీ వర్కర్లు గమనించి పోలీసులకు సమాచారం. ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన మహిళకు 30 ఏళ్ల వయస్సు ఉండవచ్చునని బావిస్ున్నారు. మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు.
శరీర భాగాలను కుక్కిన నీలం రంగు సంచుల్లో ఒకదానికి సంబంధించిన రిసీట్లు పోలీసులకు లభించాయి. వాటిని కొన్న దుకాణంలో ఆరా తీయడానికి ఓ పోలీసు బృందం సూరత్ వెళ్లింది.