నడిరోడ్డుపై యువతి బట్టలూడదీసి, వీడియో తీశారు
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే, నడిరోడ్డుపై జనం చూస్తుండగా ఓ యువతిని వివస్త్రను చేశారు. అంతేగాక, వీడియోలు కూడా తీశారు. ఇంత దారుణం జరుగుతున్నా.. అక్కడున్న జనం చూస్తున్నారే తప్ప, వారిని అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విచారకరం.
ఉదంపూర్ జిల్లా జగనూ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు ఓ యువతిని వివస్త్రను చేసి వీడియో చిత్రీకరించారు. నిందితుల్లో ఓ ఆర్మీ జవాన్ కూడా ఉండటం దిగ్భ్రాంతిని కలిగించే విషయం. నిందితుల్లో ఒకడు తన మొబైల్ ఫోన్తో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు.

వాట్సప్లోనూ ఈ వీడియోను ఉంచారు. పోలీసులు ఈ ఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఉదంపూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. బాధితురాలు మోటార్ బైక్పై వెళ్తుండగా నిందితులు ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు.
ఆమె ప్రతిఘటించడంతో బంధించి వివస్త్రను చేశారు. ఈ దుశ్చర్యను అక్కడున్న జనం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించకపోవడం దారుణమైన విషయం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications