దుస్తులిప్పేసి మహిళా టీచర్ను కొట్టారు, జరిమానా

ఆ ఉపాధ్యాయురాలు మహిళా కమిషన్ను, మహిళా కమిషన్ను ఆశ్రయించింది. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన ఆమె మేనల్లుడు ఓ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణపై కూడా ఆమెను కొట్టారు.
తన మేనల్లుడు, అమ్మాయి ఒకే కులానికి చెందినవారని, వారు వివాహం చేసుకోవాలని అనుకుంటన్నారని మహిళా టీచర్ మహిళా కమిషన్కు తెలియజేసింది. ఏప్రిల్ 19వ తేదీన గ్రామసభ జరిగినప్పుడు ఒత్తిడికి గురైన బాలిక అతనితో సంబంధం లేదని చెప్పింది. దాంతో దానికి బాధ్యురాలిగా మహిళా టీచర్ను చేస్తూ సర్పంచ్ అందరి ముందు ఆమె కొట్టాలని ఆదేశించాడు.
బాలిక పరువు తీసినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని మహిళా టీచర్ను ఆదేశించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మహిళా టీచర్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications