పోలీసుల దాష్టీకం: మహిళను జీపుపై కట్టేసి తిప్పారు, వేగానికి కిందపడటంతో తీవ్రగాయాలు
అమృత్సర్: పంజాబ్ పోలీసులు మరోసారి దాష్టీకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయబోతే అతని భార్య అడ్డుపడిందంటూ.. ఆమెను తమ జీపుపై కట్టేసి ఊరంతా ఊరేగించారు. ఇలా ఊరేగిస్తున్న సమయంలో ఆ మహిళ ప్రమాదవశాత్తు జీపు పైనుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. ఓ ఆస్తి వివాదం కేసులో బాధిత మహిళ మామను విచారించడానికి చావిందా దేవి ప్రాంతంలోని వాళ్ల ఇంటికి వెళ్లారు పోలీసులు. అతను ఇంట్లో లేకపోవడంతో సదరు మహిళ భర్తను తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆమె అడ్డుకుంది.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన పంజాబ్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి జీపు టాప్పై కట్టేసి ఊరంతా తిప్పారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కాగా, జీపుపై కట్టేసి ఊరంతా తిప్పుతున్న సమయంలో జీపు వేగానికి సదరు మహిళ కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇంత జరిగినా ఆ పోలీసులపై చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పాలన అంటూ అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో కూడా పంజాబ్ పోలీసులు ఓ మహిళను నడిరోడ్డుపై లాఠీలతో చితకబదాడం విమర్శలకు తావిచ్చింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications