తెరుచుకోనున్న శబరిమల ఆలయం, ఉద్రిక్తత: మహిళలు వస్తే అడ్డుకుంటామని భక్తులు
Recommended Video
శబరిమల: శబరిమల వద్ద ఆదివారం ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నారు. పోలీసులు ఇక్కడ 144 సెక్షన్ అమలు చేశారు. ఒక రోజు ఉత్సవం కోసం పూజారులు ఆలయం తెరవనున్నారు. ఈ నేపథ్యంలో నీలక్కల్ నుంచి పంబ వరకు పోలీసులను భారీగా మోహరించారు. 20 కిలో మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ విధించారు.
కాగా, శబరిమలలో 50 ఏళ్లకు పైబడిన మహిళా పోలీసులను కూడా మోహరించారు. భక్తులను మాత్రమే పోలీసులు లోనికి అనుమతించనున్నారు. మహిళలను అనుమతిస్తే అడ్డుకుంటామని భక్తులు చెబుతున్నారు.
రిపబ్లిక్ టీవీ-సీ ఓటరు సర్వే: దేశంలో మళ్లీ మోడీయే కానీ, ఏపీలో జగన్దే హవా, బాబుకు దెబ్బ
అయ్యప్ప స్వామి ఆలయాన్ని పూజల కోసం సోమవారం తెరవనున్నారు. 24 గంటలు తెరుచుకోనుంది. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకురాళ్లు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు అడ్డుకుంటామని చెబుతున్నారు.
ఆలయంలోకి వెళ్లేందుకు 10 నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు సిద్ధమైనట్లు స్థానిక ఎమ్మెల్యే జార్జ్.. గవర్నర్కు లేఖ రాశారు. దీని కారణంగా అల్లర్లు చెలరేగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరినందరినీ ఖాళీ చేయించాలన్నారు.
వంద ఏళ్లు వెనక్కి
శబరిమలలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల కోసం జరుగుతున్న పోరాటం కారణంగా కేరళ వంద ఏళ్లు వెనక్కి పోయిందని ప్రముఖ మలయాళం రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ అన్నారు.