ప్రధాని మోడీ విమానమైనా దిగనివ్వం: బీజేపీ ఎమ్మెల్యే షాక్
ప్రధాని నరేంద్ర మోడీ సహా వీఐపీలు ఎవరు కూడా ఇక్కడ దిగడానికి తాము అంగీకరించేది లేదని బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్ హెచ్చరించారు. రాజస్థాన్లోని కోటాకి ఇప్పటికీ విమానయాన సౌకర్యం లేదు.
కోట: ప్రధాని నరేంద్ర మోడీ సహా వీఐపీలు ఎవరు కూడా ఇక్కడ దిగడానికి తాము అంగీకరించేది లేదని బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రాజావత్ హెచ్చరించారు. రాజస్థాన్లోని కోటాకి ఇప్పటికీ విమానయాన సౌకర్యం లేదు.
అక్కడున్న చిన్న విమానాశ్రయంలో వీఐపీలు, రాజకీయ నాయకుల విమానాలు దిగడానికి మాత్రమే వెసులుబాటు ఉంది. ఈ విషయంపై సదరు బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోటాలో అన్ని సౌకర్యాలతో ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చేవరకు ప్రముఖుల విమానాలను కూడా ఇక్కడ దిగేందుకు అనుమతులు ఇవ్వద్దన్నారు. ప్రధాని విమానం కూడా దిగనిచ్చేది లేదని తేల్చి చెప్పారు.
కోటాలో పాస్పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సరైన విమానాశ్రయమే లేనప్పుడు పాస్పోర్టులు తీసుకొని ప్రజలు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు.
కోటా విమానాశ్రయం కేవలం ప్రముఖుల విమానాలు దిగేందుకే ఉపయోగపడుతోందని, ప్రజల కోసం కాదని, ప్రజల కోసం అన్ని సౌకర్యాలతో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేంత వరకు ప్రధాని విమానాన్ని కూడా ఇక్కడ దిగనివ్వమన్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications