వెక్కివెక్కి ఏడ్చిన మెమెన్, ఏ టైంలో ఏం జరిగింది?
ముంబై: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్ బుధవారం నాగపర్ కేంద్ర కారాగారంలో సహ ఖైదీలకు, జైలు సిబ్బందికి తుది వీడ్కోలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తన వల్ల ఏమైనా పొరపాటు జరిగితే క్షమించాలని వేడుకున్నాడని సమాచారం.
సోదరుడు సులేమాన్ మెమెన్ వచ్చినప్పుడు యాకూబ్ వెక్కివెక్కి ఏడ్చాడు. నాగపూర్ కేంద్ర కారాగారంలో యాకూబ్ను ఉంచిన బ్యారెక్లో 15 మంది ఖైదీలున్నారు. ఉరిశిక్షను అమలు చేసేందుకు ముందు రోజు ఖైదీలందర్నీ యాకూబ్ నుంచి వేరు చేశారు.
ప్రత్యేక సెల్కు తరలించే ముందు తోటి ఖైదీలు, జైలు సిబ్బందితో కాసేపు మాట్లాడాడు. తనవల్ల పొరపాటు జరిగితే మన్నించాలని భావోద్వేగానికి లోనయ్యాడు. ఉరి తీయడానికి ముందు రోజు నిద్ర పోలేదని లేదా మూడు నాలుగు గంటల ముందు నిద్రలేచాడని తెలుస్తోంది.

అయితే, ఇదే యాకూబ్ మెమెన్ తన కారణంగా 257 మంది మృతి విషయంలో గతంలో ఓ సందర్భంలో పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు. ఇప్పుడు తన వరకు వచ్చేసరికి వెక్కివెక్కి ఏడ్చాడు.
ఏ సమయంలో ఏం జరిగింది?
ఉదయం నాలుగుంపావుకు నిద్ర లేచాడు.
నాలుగున్నరకు దుస్తులు ధరించాడు.
పావుతక్కువ అయిదు గంటలకు అల్పాహారం తీసుకున్నాడు.
ఐదు గంటలకు వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది.
ఐదున్నరకు ఖురాన్ పఠించాడు. ప్రార్థించాడు.
ఆరు గంటలకు మరో గదికి తరలించారు.
ఆరంపావుకు జైలు పర్యవేక్షకులు, అదనపు డిజిపి ఉరికంబాన్ని, ఉరితాడును పరిశీలించారు.
ఆరున్నరకు నల్లని ముసుగును ముఖానికి తొడికి ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు.
పావు తక్కువ ఏడు గంటలకు టాడా కోర్టు తీర్పును చదివి వినిపించారు. ఉరికంబం ఎక్కించారు. అంత సవ్యంగా ఉందని ధ్రవీకరించుకొని, కోర్టు తీర్పును అమలు చేశారు.
ఏడున్నరకు.. అరగంట నుంచి వేలాడుతున్న మెమెన్ మృతదేహాన్ని కిందకు దించి, అతను మరణించినట్లు వైద్యులు ధ్రవీకరించారు. శవపేటికలో పెట్టి, సోదరులకు అప్పగించారు.
న్యాయం గెలిచిందని అటార్నీ జనరల్, తొందరెందుకని ప్రశాంత్ భూషణ్
యాకూబ్ మెమెన్ ఉరి అనంతరం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాట్లాడారు. దోషికి 22 ఏళ్ల తర్వాత శిక్ష పడిందని, న్యాయం గెలిచిందని చెప్పారు. మెమెన్ అన్ని న్యాయమార్గాలను ఉపయోగించుకున్నాడని చెప్పారు.
మరోవైపు, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. యాకూబ్ మెమెన్ను ఆదరబాదరాగా ఉరి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నారు. మెమెన్కు ఉరి అమలును నిలిపివేయాలని వాదిస్తున్న వారిలో ప్రశాంత్ భూషణ్ ఒకరు. మెమెన్ను మరణ దండ నుంచి మార్చి ఉండాల్సిందన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications